చంద్రబాబు తోనే కాదు ఎల్లో మీడియా తో కూడా పోరాటం

ఈ రెండు నెలలు అందరూ అప్రమత్తంగా ఉండాలని జగన్ చేప్పారు.

సమర శంఖారావం సభలో వైయస్సార్ జగన్ చేప్పారు. నాలుగున్నరేళ్లుగా అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకున్న టిడిపి సర్కార్.

ఎన్నికలు సమీపిస్తున వేల కొత్త డ్రామాకు తెరతీసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో బుధవారం ఏర్పాటు చేసిన. వైఎస్సార్ సి పి సమర శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ రానున్న రెండు నెలలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

చంద్రబాబు ప్రలోభాలకు లోను కాకుండా చూడాలని ప్రతి ఓటరు ఓటు వేసేలా బూత్ కమిటీలు బాధ్యత తీసుకోవాలని జగన్ కోరారు.

చంద్రబాబు ఒక్కరే మనకు పోటీ కాదని ఎల్లో మీడియా తో కూడా పోరాటం చేయాలని అన్నారు. ఉన్నవి లేనట్లుగా లేని విఉన్నట్లుగా ఎల్లో మీడియా చూపిస్తుందన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ఆరు నెలల ముందు మూడు నెలల కోసం మరో సినిమా చూపిస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు.
గత ఎన్నికల్లో గెలిచాక మొదలైన బాబు కొత్త సినిమా కధ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి అనేది ప్రతి కాంట్రాక్టర్లతొను కమిషన్లే.

ఇసుక, మట్టి ,భూములు సహా దేని వదిలిపెట్టలేదు. ఈ ఐదారేళ్లలో చంద్రబాబు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారు పై స్థాయిలో చంద్రబాబు ,కిందస్థాయిలో జన్మభూమి కమిటీలు దోచుకున్నాయి.

నాలుగేళ్ల పాటు బిజెపి, పవన్ కళ్యాణ్ తో కలిసి రాష్ట్రాన్ని ముంచేశారు.

ఇప్పుడు యూటర్న్ తీసుకొని డ్రామాలాడుతున్నారు. తాజాగా ప్రధాని మోడీ తో పోరాటం చేస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నారు.

పోలవరం ప్రాజెక్టు కట్టకుండానే జాతికి అంకితం చేయడం చంద్రబాబు సినిమాలొ చూశాం. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది. పోరాటం చేస్తున్న వారిపై కేసులు పెట్టడమే కాకుండా జైలుకు పంపుతామని బెదిరించారు.

ఇప్పుడు హోదా కోసం పోరాటం అంటూ చంద్రబాబు ఘోరంగా మోసం చేస్తున్నాడు. డోక్రా మహిళల రుణ మాఫీ కోసం ఐదేళ్లుగా ఏం మాట్లాడలేదు.

14 వేల కోట్ల రుణం ఉంటే ఐదేళ్లలో 25 వేల కోట్లకు ఎగబాకాయి. పసుపు కుంకుమ పేరుతో మళ్లీ మహిళలను మోసం చేయాలని చూస్తున్నారు.

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో 5 వేల కోట్లు రైతులకు కేటాయించారట. రైతుల చెవుల్లో పువ్వులు పడటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

కట్టని రాజధానిలో వేల ఎకరాల భూములను అమ్ముకుంటున్నారు. బాహుబలి గ్రాఫిక్స్ తో మభ్యపెడుతున్నారు.

నాలుగున్నరేళ్లు పాటు మన నవరత్నాలను కాఫీ కొడుతున్నారు.

పాదయాత్రలో ఆటోడ్రైవర్లకు 10000 ప్రకటించారు. చంద్రబాబు ఇప్పుడు కాకి డ్రెస్ వేసుకుని కాపీ కొట్టారు. 45 ఏళ్లు నిండిన ఎస్సీ ,ఎస్టీ, బిసి ,మైనార్టీల ,మహిళలకు ఇరవై ఐదు వేలు ఇస్తానని మనం చెప్పాం.

ఐదేళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు ప్రతి కులాన్ని నీకి కార్పొరేషన్లు అంటున్నారు. 2014 ముందు చేసిన బీసీ డెకరేషన్ చంద్రబాబు గుర్తుకు రాదు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్లీ బీసీలకు హామీలు ఇస్తున్నారు.

అంగన్వాడీ జీతాలుపెంచేందుకు బాబుకు మనసు రాదు. పాదయాత్రలో అంగన్వాడీలకు జీతాలు పెంచుతామని చెప్పాను. తాజాగా చంద్రబాబు నిన్ననే ఒక సినిమా తీశారు. చంద్రబాబు తనది కాని బడ్జెట్తో ఆరో బడ్జెట్ను ప్రవేశపెట్టారు.

ప్రజలను మభ్య పెట్టే విధంగా చంద్రబాబు బడ్జెట్ పెట్టారు. కాపీ కొట్టడం కూడా ఆయనకు సరిగ్గా రావడం లేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *