ప్రతిపాదన లు నావి గొప్పలు తెలుగుదేశం నాయకులవా? విశాఖ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైసీపీ కన్వీనర్ మల్ల విజయప్రసాద్ ధ్వజం
వైయస్సార్ కాంగ్రెస్ పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ అయిన మల్ల విజయప్రసాద్ గారు, ఎనలేని సేవలు చేసి ప్రజల హృదయాలలో మంచి స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి. తాను ఎమ్మెల్యేగా పని చేసినప్పుడు నియోజకవర్గం అభివృద్ధికి నివేదించిన ప్రతిపాదనలు, ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే గనబాఋ తాను చేసినట్లుగా గొప్పలు చెప్పుకుంటూ పెత్తనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రజలతో మాట్లాడుతూ, నియోజకవర్గంలో అభివృద్ధి కి సంబంధించిన ప్రతిపాదనలు నా వైయితేప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే తాను చేసినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు.
మార్కాపురం ఏరియాలో గాంధీజీ విధి చాకలకొండ ప్రాంతం ప్రకాష్ నగర్ వరకు ఉన్న పోర్ట్ స్థలం స్థానికులు అభివృద్ధికి ఉపయోగపడేల చూడాలని అప్పటి పోస్ట్ చైర్మన్ అజయ్ కలాం కు వినతి పత్రం అందించడం జరిగిందని చెప్పారు. ఆ వినతి పత్రాన్ని ఆయన స్పందించి ఆ స్థలంలో క్రీడామైదానం మార్కెట్ ఏర్పాటుకు అంగీకరించారని తెలిపారు. ఆ విషయం ఇక్కడ ప్రజలందరికీ తెలుసునని చెపరూ
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి మంటగలిసింది. ప్రస్తుత పోర్ట్ చైర్మన్గా ఉన్న కృష్ణబాబు ఈ ప్రాంతంలో పర్యటించారని, ఈ స్థలానికి బదులుగా వేరే ప్రభుత్వ స్థలం అప్పగిస్తే కేంద్ర మైదానం మార్కెట్ ఏర్పాటు చేయడానికి అంగీకరించినట్లు ఇప్ప టిడిపి ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకుంటున్నారని తెలిపారు. పోర్టు చైర్మన్ చెప్పినట్లు చేస్తే మల్కాపురం ప్రాంతానికి క్రీడా మైదానం, మార్కెట్టు రాధనీ సంగతి తెలిసి కూడా ఎమ్మెల్యే ఘన బాబు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారని అన
అన్నారు. రిఫైనరీ కంపెనీ నిధులతో ప్రధాన రహదారులు, కాలువలు, చెట్లు ఏర్పాటు చేయాలని అప్పుడు ప్రతిపాదించగా, ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యే తాను చేసినట్లుగా డప్పు కొట్టుకుంటున్నారని పేర్కొన్నారు. 45 వాటి నుంచి 49 వార్డు వరకు ఉన్న ప్రజలకు గన్న బాబు చేసిందేమీ లేదన్నారు. ఇండోర్ స్టేడియం ప్రతిపాదనలు ఎక్కడికి పోయాయి అని ప్రశ్నించారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోరమండల్ గొల్లపాలెం మున్సిపల్ ఆసుపత్రిలో ప్రశుతి విభాగం, చిన్నారుల ఆసుపత్రి నిర్మించామన్నారు. అక్కడ వైద్యుల పోస్టింగ్లు ఎందుకు భర్తీ చేయలేకపోయారని అన్నారు.
మహిళలు, గర్భిణీలు వైద్య చికిత్సల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుందని. చెప్పారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎమ్మెల్యే గనబాఋ ఈ ప్రాంత ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించి సౌకర్యాల మెరుగు పరచాలని డిమాండ్ చేశారు.