నారా…నాటకాలు నమ్మి.. ఓటు వేస్తే మళ్లీ మోసపోతారు: జగన్

నారా’సురుడి పాలనకు చరమగీతం పాడండి: జగన్

ఎన్నికలొస్తున్నాయని చంద్రబాబు పథకాల పేరుతో కొత్త డ్రామాలు మొదలు పెట్టారు.

ఈ నాటకాలు నమ్మి.. ఓటు వేస్తే మళ్లీ మోసపోతారు.

చంద్రబాబు చేసే కుట్రల్ని తిప్పికొడుతూ ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలి.

1.2014లో ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు నెరవేర్చలేదు.
2.మళ్లీ ఎన్నికలొస్తున్నాయని పథకాల పేరుతో డ్రామాలు.
3.చంద్రబాబు చేయని మోసం లేదు.. చెప్పని అబద్ధం లేదు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు వైసీపీ అధినేత జగన్.

ఎన్నికల కోసం చంద్రబాబు ఆడే డ్రామాలకు మోసపోవద్దంటూ హెచ్చరించారు.

రాష్ట్రంలో దొంగ, రాక్షసుడితో యుద్ధం చేస్తున్నామని..

చంద్రబాబు చేసే కుట్రల్ని తిప్పికొడుతూ ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మంగళవారం నెల్లూరులో జరిగిన వైసీపీ సమర శంఖారావం సభలో..

వైసీపీ బూత్ కన్వీనర్లు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబు టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధించారు.

‘ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు వరుసగా సినిమాలు చూపిస్తున్నారు.

2014లో మొదటి సినిమా మొదలు పెట్టారు.. ఆ సినిమాలో చాలా డైలాగులు (హామీలు) కొట్టారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ చేస్తామన్నారు..

జాబు రావాలంటే బాబు అన్నారు.. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. వీటిలో ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా.

చంద్రబాబు చేయమని మోసం.. చెప్పని అబద్ధమంటూ లేదు. జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్నారు’అని మండిపడ్డారు.

‘ఇప్పుడు ఎన్నిలకు సరిగ్గా ఆరు నెలల ముందు మూడు నెలల కోసం చంద్రబాబు డ్రామాలు మొదలు పెట్టారు.

ఎన్నికలొచ్చాయని ప్రత్యేక హోదా గుర్తొచ్చింది. నల్ల చొక్కాలు వేసుకొని ధర్మపోరాట దీక్షల పేరుతో బయల్దేరారు.

నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేశారు.. చిలకా గోరింకలు సిగ్గుపడేలా కలిసి మెలిసి తిరిగారు.

రాష్ట్రంలో ఎవరైనా ప్రత్యేక హోదా పేరెత్తితే అరెస్టులు చేయించారు. ఇప్పుడు హోదా కోసం పోరాటం మొత్తం తానే చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు’అంటూ మండిపడ్డారు.

‘చంద్రబాబుకునాలుగున్నరేళ్లలో గుర్తుకు రాని ప్రజలకు ఇప్పుడు గుర్తొస్తున్నారు.

డ్వాక్రా అక్కచెల్లెమ్మలను ఆదుకుంటామని వైసీపీ ప్రకటించగానే..

చంద్రబాబు పసుపు-కుంకమ పేరుతో డ్రామా మొదలు పెట్టారు.

నవ రత్నాల్లో రైతులకు సాయం అందిస్తామనగానే.. ఓట్ ఆన్ బడ్జెట్‌లో కొత్త పథకాన్ని పెట్టారు.

రూ.5వేల కోట్లు కేటాయించారు. అవ్వా, తాతలకు పింఛన్ పెంచుతామని వైసీపీ గతంలోనే ప్రకటించింది.

నాలుగున్నరేళ్లలో గుర్తుకు రాని వృద్ధులకు ఎన్నికలొస్తున్నాయని హడావిడిగా పింఛన్ పెంచారు.

ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని చెప్పగానే.. చంద్రబాబు ఆటోలకు లైఫ్ టాక్స్ రద్దు చేశారు.

ప్రతి కులానికి కార్పొరేషన్ అని జగన్ చెప్పగానే.. చంద్రబాబు ప్రతి కులానికి కార్పొరేషన్ అన్నారు’

‘చంద్రబాబు ఇక పోలవరం పూర్తి కాకుండా జాతికి అంకితం చేస్తారు. అమరావతి పేరుతో డ్రామాలాడతారు..

రాజధాని ఏది అని అడిగితే బాహుబలి సినిమా చూడమన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ఏమైంది.

కొత్త ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిపోయి.. ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు.

ఎన్నికలొస్తున్నాయని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పేరుతో ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ మోసాల్ని నమ్మి మోసపోవద్దు’అని సూచించారు జగన్.

‘ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి.. అన్నొస్తాడు పిల్లల్ని బడికి పంపిస్తే.. అమ్మ ఒడి పేరుతో సంవత్సరానికి 15వేలు ఇస్తాడు. రైతులకు చెప్పండి..

అన్న సీఎం అయిన వెంటనే మే మాసం వస్తే ప్రతి రైతు చేతిలో రూ.12,500 పెడతాం..

జగన్ ముఖ్యమంత్రి అయితే అన్న చేయూత కింద 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 75 వేల రూపాయలు ఇస్తాడని చెప్పండి..

పొదుపు సంఘాలకు ఎన్నికలకు వరకు ఉన్న రుణాలు.. నాలుగు దఫాలుగా మాఫీ చేస్తాం.. మీ చేతికే ఇస్తామని ప్రతి అక్కా, చెల్లికి చెప్పండి.

ప్రతి అవ్వ, తాతకు చెప్పండి.. అన్న ముఖ్యమంత్రి అయితే పింఛన్ రూ.3వేలు ఇస్తాడని చెప్పండి. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని చెప్పండి’

‘ఈ ఐదేళ్లలో 1250మందిపై చంద్రబాబు ప్రభత్వం దొంగ కేసులు పెట్టింది.

దేవుడి దయతో వైసీపీ అధికారంలోకి రాగానే.. రాష్ట్రంలో అమాయకులపై అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేస్తాం.

వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుకాగానే ప్రతి పేదవాడికి పథకం అందేలా చూస్తా.. పారదర్శక పాలన అందిస్తాం.

ప్రభుత్వ పథకాల విషయంలో ఏ పార్టీ చూడం.. ఏ కులం చూడం.. ఏ మతం చూడం.. అర్హుడైతే చాలు.

చంద్రబాబు అవినీతి సొమ్మును మూటలు, మూటలు తీసుకొని వస్తారు. ఆ అవినీతి డబ్బు తీసుకోండి.. కాని ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.

మనసు ఏం చెబితే అదే చేయండి.. మనసాక్షిని నమ్మి ఓటేయండి’అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *