సీఎం జగన్‌కు నందమూరి బాలకృష్ణ లేఖ..! ఎందుకో తెలుసా..?


ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లేఖ రాశారు.

హిందూపురాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనీ, హిందూపురం జిల్లా కేంద్రమైతే అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని సూచించారు.

అలాగే హిందూపురం నియోజకవర్గం మాల్గురులో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.

ఇప్పుడున్న 13 జిల్లాలకు అదనంగా 12 కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

జూలై 15న జరిగే కేబినెట్ సమావేశంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించి ప్రకటన వస్తుందని ప్రచారం జరుగుతోంది.

ఇటీవల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రస్తావన వచ్చిన సంగతి తెలిసిందే.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే ఆలోచన ఉందని అధికారులకు సీఎం వివరించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే బాలయ్య జగన్‌కు కొత్త జిల్లాల లిస్టులో హిందూపురం కూడా చేర్చాలంటూ లేఖ రాసినట్లు తెలుస్తోంది.

మరి బాలయ్య విన్నపాన్ని జగన్ స్వీకరిస్తారో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *