అచ్చెన్నాయుడు ఇంటి గోడ దూకి ఆయన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు…వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
అచ్చెన్న అరెస్టు, చంద్రబాబుపై తీరు సరికాదు.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
అధికార వైసీపీని ఇరుకున పెట్టేలా ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ ఎమ్మె్ల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు సహా పలు అంశాలపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన తీరు సరిగా లేదని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు శనివారం ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అచ్చెన్నాయుడును చూసేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆస్పత్రిలోకి అనుమతించకపోవడం సరైన పద్ధతి కాదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.
కొందరు వైసీపీ నేతల అత్యుత్సాహం.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిపెడుతోందని చెప్పారు.
అలాగే అచ్చెన్నాయుడు ఇంటి గోడ దూకి ఆయన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. నిజంగా తప్పు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
టీడీపీ నేతలు రోజుకొకరు అరెస్టు అవుతారని.. మంత్రులు అనడం సరి కాదని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
మంత్రుల వ్యాఖ్యల వల్ల కావాలనే అరెస్టులు చేసినట్లు ఉందని ప్రజలు అనుకుంటారని ఎంపీ వ్యాఖ్యానించారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. అలాగే నాయకులపై ఎలాంటి ఆధారం లేకుండా ఎవరూ కేసులు పెట్టలేరన్నారు.
అలాగే అచ్చెన్నను పరామర్శించడానికి చంద్రబాబును అనుమతించకపోవడం.. మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఎంపీ వ్యాఖ్యానించారు.
పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారన్నారు.