చంద్రబాబు త్వరగా కోలుకోవాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఈ హ్యాష్ ట్యాగ్తో ట్వీట్స్ చేస్తున్నారు.

హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రోజాతో పాటూ మరికొందరు ట్వీట్స్ చేశారు.
చంద్రబాబు త్వరగా కోలుకోవడం ఏంటని అనుకుంటున్నారా. ట్విట్టర్లో ఇదే ఇప్పుడు హాట్టాపిక్.
బాబు పేరు మార్మోగింది. #GetWellSoonCBN హ్యాష్ ట్యాగ్ ఇండియా వైడ్గా ట్రెండింగ్లో ఉంది.
చంద్రబాబు త్వరగా కోలుకోవాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఈ హ్యాష్ ట్యాగ్తో ట్వీట్స్ చేస్తున్నారు.
హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రోజాతో పాటూ మరికొందరు ట్వీట్స్ చేశారు. GetWellSoonCBNపేరుతో ట్వీట్ల మోత మోగిపోయింది.
హ్యాష్ట్యాగ్ వెనుకు ఉన్న అసలు విషయానికి వస్తే.. చంద్రబాబు మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తున్నారు.
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని జగన్ సర్కార్ను టార్గెట్ చేస్తున్నారు. అంతేకాదు రాజీనామాలు చేయాలంటూ సవాళ్లు విసిరారు.
రాజధాని రెఫరెండంగా ఎన్నికలు వెళదామన్నారు. డెడ్లైన్ కూడా పెట్టారు. దీంతో చంద్రబాబుకు వైఎస్సార్సీపీ కౌంటర్ ఇస్తోంది.
అందులో భాగంగానే ఈ హ్యాష్ ట్యాగ్ను తెరపైకి తీసుకొచ్చారు.
చంద్రబాబుకు మతి భ్రమించిందని.. ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నారని వైఎస్సార్సీపీ టార్గెట్ చేసింది. అందుకే త్వరగా కోలుకోవాలంటూ ఇలా ట్వీట్స్ పెడుతున్నారు.
ఈ క్రమంలోనే గెట్ వెల్ సూన్ చంద్రబాబు అంటూ ట్వీట్స్ మోత మోగింది. అదే సమయంలో APWelcomes3Capitals హ్యాష్ ట్యాగ్ను కూడా ట్రెండ్ చేశారు. మొత్తానికి సోషల్ మీడియా ద్వారా చంద్రబాబును వైఎస్సార్సీపీ టార్గెట్ చేసింది.