రాజంపేట టిడిపి ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరిక…

ముందుగా నిర్ణయించుకున్నటే టిడిపి ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరారు. కడప జిల్లా రాజంపేట నుండి 2014 ఎన్నికల్లో టిడిపి నుండి గెలిచి, అయినా తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు.

ఆయనకు వైసీపీ అధినేత పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. భారీగా తన అనుచరగణంతో మేడ తరలివచ్చారు.

అదే కార్యక్రమానికి రాజంపేట వైసీపీ ఇన్ చార్జ్ ఆకేపాటి అమర్నాథరెడ్డి గైర్హాజరయ్యారు.

రాజంపేట నుండి భారీగా అనుచరవర్గం కార్ల ర్యాలీతో, లోటస్ పాండ్ కు చేరుకున్నారు. మేడ తన సోదరులు, అనుచరగణంతో వైసీపీలో చేరారు.

గత నెల రోజులుగా మేడ వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. గతవారం ఆయన జగన్తో సమావేశమయ్యారు.

రాజంపేట నుండి తిరిగి సీటు ఇస్తారా లేదా? అనే మీమాసం లో కనిపించారు.

జగన్ సీటు విషయంలో అమర్నాథ్ రెడ్డి కే ఉంటుందని స్పష్టం చేశారు. మేడ చేరిక విషయంపై అమర్నాథ్రెడ్డి తో జగన్ చర్చించారు.

మేడ టిడిపిని వీడు ట తో అక్కడ ఆశావహుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది.

మేడ చేరిక కార్యక్రమానికి స్థానిక నేత ఆకేపాటి అమర్నాథ్రెడ్డి గైర్హాజరయ్యారు.

మేడను పార్టీలోకి తీసుకోవడంపై అమర్నాథ్రెడ్డి అనుచరులు అసంతృప్తితో ఉన్నారు.

ఇదే విషయంపై జగన్ అమర్నాథ్ రెడ్డి ని పిలిపించి మాట్లాడారు, ఆ సమావేశం తర్వాత అమర్నాథ్ రెడ్డి తన అభిప్రాయం స్పష్టం చేశారు. జగన్ తోనే తను ఉంటానని చెప్పారు.

తనకు పెద్ద పదవులు అవసరం లేదని ఎమ్మెల్యే పదవి ఇస్తే చాలని చెప్పుకున్నారు. అయితే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి చేరిక కార్యక్రమానికి హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *