కేసీఆర్: మంగళవారం సాయంత్రం నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు…

అయోధ్య రామ మందిరం అంశంపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీపై ఫైర్రామ జన్మభూమిపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

దేశంలోని ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లపై సీఎం కేసీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. దేశం బాగుపడాలంటే ఆ రెండు పార్టీలను తరమి కొట్టాలని పిలుపునిచ్చారు.

నిజామాబాద్‌లో మంగళవారం (మార్చి 19) సాయంత్రం టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ..

కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావడానికి ప్రజలు సహకరించాలని కోరారు. ‘దేశాన్ని బాగుచేద్దాం – సహకరించండి’ అని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ అయోధ్య రామ జన్మభూమి వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కరీంనగర్ మీటింగ్‌లో నేను మాట్లాడిన తర్వాత బీజేపీ వాళ్లు నాపై విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో గ్రూపులు పెట్టి తిడుతున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నన్ను ఓ ప్రశ్న అడిగారు. రామ జన్మభూమిపై నా స్టాండ్ ఏంటో చెప్పాలట. అసలు రాజకీయ పార్టీలు ఉన్నది వీటి కోసమేనా.

అసలు మీది మత ప్రచారం చేసే పార్టీయా? ప్రజా సమస్యలు తీర్చే పార్టా.. లక్ష్మణ్ సమాధానం చెప్పాలి’ అని కేసీఆర్ అన్నారు.

‘రామ జన్మభూమి.. రావణ జన్మభూమి.. శ్రీకృష్ణ జన్మభూమి, సత్యభామ జన్మభూమి..

చివరికి శూర్పనఖ జన్మభూమి, దుర్యోధన జన్మభూమి.. ఇలా చెప్పుకుంటూ పోతే అందరి జన్మభూములు కావాలంటారు.

రాజకీయ పార్టీలు ఉన్నది ఇవి చెప్పడానికేనా.. చినజీయర్ స్వామి, శృంగేరి పీఠాధిపతి లాంటి వారు వీటికి పరిష్కారం అడిగితే చెప్పరా..

నాయకులున్నది ప్రజల సమస్యలు తీర్చడానికా? ఇలాంటి వాటిపై రాజకీయాలు చేయడానికా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు.

ఇతర మతాలను తిట్టేవాడే హిందువా అని కేసీఆర్ ప్రశ్నించారు. భగవద్గీతలోనూ అలా చెప్పలేదన్నారు. ‘మీరు డూప్లికేట్ హిందువులు. ఓట్ల రాజకీయం కోసం మీరు మాట్లాడుతున్నారు.

ప్రజల నిరుద్యోగ సమస్య, కరెంట్ సమస్య, పేదరికం సమస్యలను తీర్చడం రాజకీయ నాయకుల పని’ అని కేసీఆర్ అన్నారు.

నిఖార్సైన హిందువులం తామేనని కేసీఆర్ మరోసారి చెప్పారు. ‘మేం హిందువులం కాదా.. అయ్యగారిని పిలిచి పూజలు చేస్తలేమా.. గుళ్లకు పోవడంలేదా, గుండు కొట్టించుకోవడం లేదా..

వీళ్లు చెప్తేనే ఇవన్నీ చేస్తున్నామా..’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. సమస్త జీవరాశి కూడా సంతోషంగా ఉండాలని హిందువులు కోరుకుంటారంటూ ఓ శ్లోకం చెప్పారు..

రామ్ మందిర్ అంశం తర్వాత కెసిఆర్ TRS జాబితా 21న నిజాంబాద్ బరిలో కవితా లేనట్లేనా అని ప్రశ్నించారు?

TRS జాబితా 21న.. నిజామాబాద్ బరిలో కవిత లేనట్లేనా?

లోక్ సభ బరిలో తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మార్చి 21న ప్రకటించనున్నట్లు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తెలిపారు. నిజామాబాద్ స్థానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టీఆర్‌ఎస్ పార్టీ తరఫున లోక్ సభ బరిలో దిగే అభ్యర్థుల జాబితాను గురువారం (మార్చి 21) ప్రకటించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.

నిజామాబాద్ లోక్ సభ స్థానంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం సాయంత్రం నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఘాటు విమర్శలు చేశారు.

మంత్రి పదవుల మాదిరిగానే టీఆర్‌ఎస్ అభ్యర్థుల విషయంలోనూ కేసీఆర్ ట్విస్టు ఇస్తారని అందరూ భావిస్తున్నారు.

ఖమ్మం ఎంపీ స్థానం విషయంలో ఇలాంటి వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ మీటింగ్‌లో చేసిన వ్యాఖ్యలు ఉత్కంఠ పెంచుతున్నాయి.

‘మార్చి 21న ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తా.. అదే రోజు నిజామాబాద్ అభ్యర్థిని కూడా ప్రకటిస్తాం..’ అని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ కవిత పేరు ప్రస్తావించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

కవితకు మరో స్థానం నుంచి టికెట్ ఇచ్చి.. నిజామాబాద్ నుంచి మరో అభ్యర్థిని బరిలోకి దింపుతారేమోనని ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

అయితే.. నిజామాబాద్ సమావేశంలో ఎంపీ కవిత అన్నీ తానై వ్యవహరించారని.. అలాంటిదేమీ ఉండకపోవచ్చని మరికొంత మంది అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *