నాకు జేజేలు కొట్టడం కాదు.. రౌడీ రాజకీయాలను తరిమికొట్టండి: పవన్

రాత్రికి రాత్రి అద్భుతాలు చేయలేను కాని.. 25 ఏళ్ల రాజకీయ ప్రయాణాన్ని రూపొందించుకుని జనంలోకి వచ్చాను.

రాయలసీమ నుంచి ఏంత మంది సీఎంలు వచ్చినా ఆ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడింది.

1.కర్నూలులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ షో

2.రాజకీయం కొన్ని కుటుంబ కబంధ హస్తాలలోనే ఉంది.

3.అధికారం ఉన్నవారికే వ్యాపారాలు, ఉద్యోగాలు.

జనసేన పార్టీ లేకుండా తెలుగు రాజకీయాలు ఉండవంటున్నారు పవన్ కళ్యాణ్. ఒక్క కులాన్నో..

ఒక్క ప్రాంతాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదని.. కులాల గోడలు బద్దలు కొట్టడానికి వచ్చానన్నారు. పదవులు ఉన్నా.. లేకున్నా ప్రజల కోసం పనిచేస్తానన్నారు.

రాత్రికి రాత్రి అద్భుతాలు చేయలేను కాని.. 25 ఏళ్ల రాజకీయ ప్రయాణాన్ని రూపొందించుకుని జనంలోకి వచ్చానన్నారు..

ఎన్నికల మేనిఫెస్టోపై నమ్మకం నమ్మకం లేదు.. మిగిలిన పార్టీల్లా అబద్ధాలు చెప్పలేననన్నారు.

రాయలసీమ పర్యటనలో ఉన్న జనసేనాని.. ఆదివారం కర్నూలులో రోడ్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు.

రౌడీయిజం, ఫ్యాక్షనిజం నుంచి బయటపడాలని జనం కోరుకుంటున్నారన్నారు జనసేనాని.

కర్నూలు అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గుర్తుకు వస్తారని.. రెడ్డి అంటే కులం కాదు ప్రజలను రక్షించేవాడు అని వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లో కులాలు ఎక్కువైపోయాయని.. రాజకీయం కొన్ని కుటుంబ కబంధ హస్తాలలోనే నలిగిపోతుందన్నారు.

రాయలసీమలో గొర్రెల కాపరి కాటంరాయుడు నెల్లూరు రాజుపై ఎదురుతిరిగి మదం అణిచాడని..

ప్ర‌స్తు‌తం ఏపీ రాజకీయాలలో అదే పరిస్థితి రావాలన్నారు.

మార్పు రావాలంటే తనకు జేజేలు కొట్టడం కాదు.. రౌడీ రాజకీయాలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

తన దగ్గర డబ్బులు, టీవీ ఛానళ్లు‌, పత్రికలు లేవని.. మీడియా ఉందని.. రూ.వేల కోట్లు ఉన్నాయని జనం తన వెనుక రాలేదన్నారు. ‘

కాన్షీరాం నాకు ఆదర్శం.. చిన్న ఉద్యోగి జాతీయ పార్టీని స్థాపించాడు. నేను జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు’అన్నారు పవన్.

కర్నూలుతో తనకు అరుదైన అనుబంధం ఉందన్నారు జనసేనాని. టీజీ వెంకటేష్ తనను ఎన్నిసార్లు ఎగతాళి చేసినా.. తిట్టినా నిగ్రహించుకొని మాట్లాడతున్నారన్నారు.

ఒకరోజు ఆతిథ్యం ఇచ్చారన్న కృతజ్ఞత టీజీ వెంకటేష్‌పై ఉందన్నారు.

రాష్ట్రలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు పవన్. రౌడీయిజం, ఫ్యాక్షనిజం నుంచి బైటపడాలని బలంగా నమ్ముతున్నారన్నారు.

ధనరాజకీయలు, ముఠా రాజకీయాలు చేయనని.. పదవులు ఉన్నా, లేకున్నా ప్రజల కోసం పనిచేస్తానన్నారు.

రాయలసీమ పురుషుల్లో పౌరుషం చచ్చిపోయిందేమోకాని.. మహిళల్లో మాత్రం చావలేదన్నారు.

ముస్లింలను మైనార్టీ అని ఎందుకు అనాలి.. వారిలో భయం ఎందుకు ఉండాలని ప్రశ్నించారు.

హిందువులకేనా దేశ భక్తి.. ముస్లింలకు దేశభక్తి లేదా.. దేశం కోసం ముస్లింలు ఎంత మంది ప్రాణాలు పోగుట్టుకున్నారని గుర్తు చేశారు.

రాయలసీమ నుంచి ఏంత మంది సీఎంలు వచ్చినా ఆ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు పవన్.

అధికారం ఉన్నవారికే వ్యాపారాలు, ఉద్యోగాలు పొంది పేదలను ఇంకా పేదలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాయలసీమ కోసం ప్రాణాలైనా ఇస్తా.. రాయలసీమలో ఫ్యాక్షనిజం పోవాలన్నా, పరిశ్రమలు రావాలన్న జనసేన రావాలన్నారు.

యువత తనను సీఎం కావాలని కోరుకుంటున్నది స్వార్థం కోసం కాదు.. ఉద్యోగాల కోసం, దౌర్జన్యాన్ని ఎదుర్కోవడానికి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *