రైతులపై ప్రేమ కాదని.. బినామీల పేర్లతో కొన్న భూములపై ప్రేమ అని భువనేశ్వరిపై ఎమ్మెల్యే రోజా ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు.

కన్నతండ్రికి అన్నం పెట్టని..! భువనేశ్వరిపై ఎమ్మెల్యే రోజా ఘాటు విమర్శలు

రాజధాని భూములు లాక్కున్నప్పుడు బయటకు రాని భువనేశ్వరి.. ఇప్పుడు ఎందుకు వచ్చారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

అది అమరావతి రైతులపై ప్రేమ కాదని.. బినామీల పేర్లతో కొన్న భూములపై ప్రేమ అని విమర్శలు గుప్పిస్తున్నారు.

రాజధాని పరిరక్షణ సమితికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తన గాజులను విరాళంగా అందజేయడంపై అధికార వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

రాజధానికి భూములు లాక్కున్నప్పుడు బయటకు రాని భువనేశ్వరి.. ఇప్పుడు ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తున్నారు. అది అమరావతి రైతులపై ప్రేమ? లేక తన భర్త.. తన కుమారుడు బినామీల పేర్లతో కొన్న భూములపై ప్రేమ? అని నిలదీస్తున్నారు.

తాజాగా ఈ వ్యవహారంపై ఏపీఐఐసీ చైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఘాటుగా స్పందించారు. నారా భువనేశ్వరి గాజులు ఇవ్వడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చివరి రోజుల్లో కన్నతండ్రి ఎన్టీఆర్‌కే అన్నం పెట్టని భువనేశ్వరి.. రాజధాని రైతులకు పరమాన్నం పెడుతానంటున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. భువనేశ్వరి గాజులు విరాళంగా ఇవ్వడంపై ఇప్పటికే పలువురు మంత్రులు.. వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

భువనేశ్వరిని ఉద్దేశించి పలువురు వైసీపీ నేతలు మాట్లాడుతూ గాజులు కాదు ఇవ్వాల్సింది.. కొట్టేసిన భూములంటూ ఎదురుదాడికి దిగారు. ఇది అమరావతి రైతులపై ప్రేమ కాదని.. అమరావతిలో కొన్న భూములపై ప్రేమగా అభివర్ణిస్తున్నారు. తన అల్లుడు దుర్మార్గుడు.. అతనిని నమ్మొద్దని కన్నతండ్రి, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కన్నీళ్ల పర్యంతమైనప్పుడు కూడా జాలి కలగని భువనేశ్వరికి ఇప్పుడెందుకు జాలి కలిగిందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *