దూసుకెళ్తున్న కారులో కరెన్సీ కట్టలు, ఏకంగా‌ 6.52 కోట్లు స్వాధీనం.

వేగంగా చెన్నై వైపు బాగా దుమ్ము కొట్టుకుపోయిన ఒక కారు దూసుకుపోతుంది. వ అదే మార్గం లో విధుల్లో ఉన్న SI కి అనుమానం కలిగి చేజ్ చేసి తనిఖీలు నిర్వహించారు.

కార్ డిక్కీ లోను, సీటు కింద కరెన్సీ కట్టలు చూసి షాక్ అయ్యారు. అందులో ఉన్న మొత్తం 6.52 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

కారులో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ఈ ఘటన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ వద్ద బుధవారం జరిగింది.

నెల్లూరు జిల్లా SP ఐశ్వర్య రస్తోగి కథనం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఇద్దరు వ్యక్తులు కారులో చెన్నై వెళ్తున్నారు.

SI దాసరి వెంకటేశ్వరరావు సూళ్లూరుపేట వస్తుండగా రహదారిలో కారు వేగంగా వెళ్లడం గమనించారు.

అందులో ఉన్న డ్రైవర్ తో సహా మిగిలిన ఇద్దరు వ్యక్తులు కంగారుగా ఉన్నట్లు కనిపించడంతో కారు ఆపి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

కారును క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో అందులో నగదు గమనించి ఆదాయపు పన్ను అధికారులకు సమాచారం అందించారు. అనంతరం నగదును లెక్కించగా 6.52 కోట్లు ఉన్నట్లు నిర్ధారించారు.

నర్సాపురానికి చెందిన శ్రీదేవి నగల వ్యాపారి ప్రవీణ్ కుమార్ జైన్ చెప్పడంతో తాము చెన్నైకి తీసుకువెళుతున్నట్లు వారు చెప్పారు.

వీరు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

2 నెలల క్రితం తెలంగాణ ఎన్నికల సమయంలో వరంగల్ జిల్లాలో ఇదే తరహాలో 5 కోట్లు దొరికాయి. ఆ నగదు కూడా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుండి తరలించారని పోలీసులు గుర్తించారు.

తాజాగా ఇప్పుడు కూడా నరసాపురం చెందినవారవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *