అవకాశం దొరికితే ప్రధాని కావాలి లేకపోతే చక్రం తిప్పే సారధి కావాలి రెండే మార్గాలు
అయితే- కింగులూ… కింగ్ మేకర్లూ!
రాజకీయాల్లో పదవులను అధిష్టంచేవారుంటారు. వారికి అన్నివిధాలుగా సహకరించి పదవీభాగ్యం కలీగేలా చూసే కింగ్ మేకర్లుంటారు, తలలో నాలికలా వ్యవహరించే అనుచరుల, పల్లకి మోసే కార్యకర్తలు ప్రాపకం పొందుతూ పైరవీలు చేసే కోటరీ అంతా కలిస్తేనే రాజకీయం. భారత రాజకీయాలు ఎన్నికలకు చేరుతున్న తరుణంలో తాజాగా “చక్రవర్తులు” పుట్టుకొస్తున్నారు. ద్విపాత్రాభినయం చేయాలను కోవడం వీరి ప్రత్యేకత.
అవకాశం దొరికితే ప్రధాని కావాలి దీనివల్ల 2019 ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఏర్పడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా. ఈసారధులు సంఖ్య పెరిగిపోయింది. ఇది రాజకీయాల్లోని ఆస్ధిరతకు అద్దం పడుతోంది. జాతీయ పార్టీలు బలంగా ఉంటే ఇటువంటి స్థితి ఉత్పన్నం కాదు. వాటి బలహీనత కారణంగా ప్రాంతీయంగా ప్రజారక్షణ, ఆదరణ కలిగిన నేతలు చక్రం తమ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారు. కాంగ్రెస్ తో కూడి ఏర్పడే కూటమికే. ఈ తలనొప్పులు బెడద ఎక్కువగా కనిపిస్తొంది. రాహుల్ అనుభవరాహిత్యాన్ని ఆసరాగా చేసుకుంటూ ఆడింది ఆట పాడింది పాటగా కూటమిని తమ చెప్పుచేతల్లో కి పెట్టుకోవాలనుకునే యావ మొదలైంది.
తమిళనాడులో ఏఐఏడీఎంకే దాదాపు నిర్వీర్యమైపోయిన పరిస్థితి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడి రోజులు లెక్కపట్టుకుంటోంది. ఒక రకంగా చెప్పాలంటే కేంద్రంతో కొంత మేరకు ఈ విషయంలో చర్చలు జరిగినట్లు కూడా ప్రచారం ఉంది.
రాష్ట్రపతి పాలనా పెట్టి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు పెడితే డీఎంకే అధికారంలోకి వస్తుంది. దాని వల్ల తమకు పెద్ద ప్రయోజనం లేదని గ్రహించిన కమలనాథులు ఏఐఏడీఎంకే పాలనా కొనసాగడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. లోపాయికారీగా 2019లోక్ సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే సహకారంతో కొన్ని సీట్లు గెలుచుకోవచ్చని ప్లాన్ వేశారు. ఈలోపు తాము కూడా సొంతంగా కొంత బలపడే ఛాన్సు ఉందని స్థానిక నాయకులు అధిష్టానానికి నివేదించారు మొత్తం పరిస్థితిని ఆకళింపు చేసుకున్న తరువాతనే రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అంటూ డీఎంకే అధినేత స్టాలిన్ ప్రకటన చేశారు.
కాంగ్రెసుకు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తే మిత్రపక్షాల్లో తమకు ప్రధామ ప్రాధాన్యం ఉండాలనే ఉద్దేశం ఈ ప్రకటనలో ఉంది. చంద్రబాబు పైకి కోన్ని నిజాలు చెప్పలేరు ఏపీ రాజకీయాలను కుమారుడు లోకేశ్ కు అప్పగించి కేంద్రానికి వెళ్లాలనే ఆలోచన ఆయన లోనూ దాగి ఉంది. అయితే లోకేశ్ తనను తాను ప్రూవ్ చేసుకోకవడం వల్ల రిస్కు చేయలేకపోతున్నారు.
పైపెచ్చు ప్రధాని అభ్యర్థిగా తన పేరు వేరే వారు ప్రతిపాదిం చకపోవడమూ ఆయనకు ఇబ్బందిగా మారింది. రాహుల్, మమత, మాయావతి శరద్ పవర్ వంటి వారినెవరినీ. ఈ రేసులో ప్రోత్సహంచకుండా . ఆయన జాగ్రత్త పడుతున్నారు. అవకాశం కలిసి వస్తే అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు
అయితే ఎవరో ఒకరు తన మెడలో గంట కట్టాలి. ఒకవేళ అది జరగకపోతే చక్రవర్తిగా చక్రం తిప్పడంతో సంతృప్తి పడతారు. కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీలతో ఈ విషయంలో చాకచక్యంగా, లౌక్యం గా ప్రవర్తిస్తున్నారు . చంద్రబాబు దేవెగౌడ్, మమత, మాయావతి వంటి వారి పేర్లు బయటకు రావడాన్ని ఆయన ఇష్టపడటం లేదు. కాంగ్రెస్ కూటమి లో ఉన్న నాయకుల్లో తానే అత్యధిక అనుభవం కలిగిన రాజకీయవేత్త ననేది చంద్రబాబు భావన.. ఆయన రాజకీయ చాణక్యాన్ని మిత్రులను కలపడానికి వాడుకోవాలనేది కాంగ్రెస్ యోచన. మొత్తం మీద ఈ రాజకీయ చాలనంలో ఎవరు పై చేయి సాధిస్తారనే దే అంతుపట్టని రహస్యం గతంలో ఎన్నడూ లేనంత అవకాశం ఈసారి తమ కోసం ఎదురు చూస్తోందిని భావిస్తున్నారు మమతా బెనర్జీ, మాయావతి, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్ వంటివారు. వీరంతా పోటీ పడితే అనుభవజ్ఞుడిగా మధ్యేమార్గంలో తన రొట్టె విరిగి నేతిలో పడదా? అని ఎదురు చూస్తున్నారు మాజీ ప్రధాని దేవెగౌడ్… * పశ్చిమ బెంగాల్ లో 35 నుంచి 39 స్థానాలు సాధించి తిరుగులేని శక్తిగా నిలిస్తే ప్రధాని అయ్యే చాన్స్ తనదే నని భావిస్తున్నారు. మమత దళిత కార్డుతో ముందు వరుసలో తానే ఉన్నాను అనుకుంటున్నారు మాయావతి* కాంగ్రెస్కు ఓటు బ్యాంకు కావాలంటే తనను ప్రతిపాదించ వలసిందేనని ఆమె కోరుకుంటున్నారు.
సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్తో తండ్రి ములాయం కు పెద్దగా సత్సం బంధాలు లేవు. దాంతో ప్రధాని రేసులో వెనుకబడిపోయారు. అయినా ఆశ చావలేదు. చంద్రబాబు వంటి నేతలు తనను ప్రతిపాదిస్తారని నమ్ముతున్నారు. మరాఠా స్ర్టాంగ్ మేన్ శరద్ పవార్ ది ఒక ప్రత్యేక కేసు సీనియార్టీ దృష్ట్యా ఆయన ఎవరినీ ఏమీ అడగలేరు. తనకు మించిన అర్హులు వేరేవారు లేరని అనుకుంటూ ఉంటారు. అడగనిదే అమ్మయినా పెట్టదు చందంగా ఆయన ప్రస్తావనకే రాకుండా పోతున్నారు. పూర్తి స్థాయి విజయం సాధించారు లేకపోయినా, 2019 ఎన్నికల్లో రాహుల్ బలపడి బీజేపీ ని కట్టడి చేయగలిగితే వీరి అవకాశాలకు గండి పడ్డట్టే. అందుకే వివిధ పార్టీల నాయకులంతా ఈసారి చాన్స్ మిస్ కాకూడదని పోటీలు పడుతున్నారు.