జగన్ అంగీకరిస్తే కాంగ్రెస్ లో కలుపుకొని, C M ని చేస్తామంటున్న చింతా మోహన్

వైయస్ జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు. కాంగ్రెస్ పార్టీపై కోపంతో బయటకు వెళ్లి YSR కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు.

ఆయన అంగీకరిస్తే కాంగ్రెస్ లో కలుపుకుంటాము.

అవసరమైతే ముఖ్యమంత్రిని చేయడానికి కూడా ఎటువంటి అభ్యంరతరం లేదు అని చింతా మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ అంగీకరిస్తే అధిష్టానం తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.

జగన్ అభిప్రాయం తెలిసిన కూడా తానే స్వయంగా విజయమ్మ, జగన్ తో మాట్లాడుతానని అన్నారు.

అయితే ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ప్రస్తుతం జనసేన పార్టీ నడుపుతున్న పవన్ కళ్యాణ్ కూడా కాంగ్రెస్ నేత కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి సోదరుడు.

కాంగ్రెస్ తో పొత్తు అంగీకరిస్తే వైసీపీ, జనసేన ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని సులువుగా దక్కించుకుంటామని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

గతంలో సమాజ్ వాది, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ లను కలపడంలో తాను కృషి చేసానని అన్నారు.

ప్రస్తుత రాజకీయాల్లో కి ప్రియాంక గాంధీ చేయడంతో కాంగ్రెస్ కి పూర్వ వైభవం వచ్చినట్లే అని అన్నరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *