ఆగిన నగదు రహిత వైద్యం
ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశ నగదు రహిత వైద్య సేవలను కొనసాగించేది లేదని వెల్లడించింది, మంగళవారం విజయవాడలో ఆశ నిర్వహించిన సమావేశంలో వివిధ ఆసుపత్రుల ముఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు, ప్రభుత్వము నిధులను విడుదల చేస్తున్నట్టు చెబుతున నెట్ వర్క్ ఆసుపత్రులకు చెల్లింపులు లేవని పేర్కొంది, నగదు చెల్లింపులు పూర్తి స్థాయిలో జరిగే వరకు వైద్య సేవలకు దూరంగా ఉంటామని, అత్యవసర కేసులు మినహా మిగిలిన వాటిని చూడలేమని చెప్పింది, పెండింగ్లో ఉన్న బిల్లులో 70 శాతం చెల్లించేందుకు వీలుగా జీవో జారీ చేయమని కోరింది, మరోవైపు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వం విడతలవారీగా జారీచేసిన సుమారు 200 కోట్ల కు సంబంధించి ఆసుపత్రులకు చెల్లింపులు మొదలయింది అన్నారు, విధుల్లో 50 శాతం అడ్వాన్స్ రూపంలో చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంగీకరించారని వివరించారు, జనవరి ఒకటో తేదీ నుంచి కొన్ని ఆసుపత్రిలో నగదు రహిత వైద్య సేవల నిలిపివేత మొదలయ్యింది, మరో అసోసియేషన్ కు సంబంధించిన ఆసుపత్రులలో యధావిధిగా సేవలు కొనసాగుతున్నాయి.