అచ్చెన్న…శ్రీకాకుళం నుంచి విజయవాడకు సుదీర్ఘ ప్రయాణం చేయడంతో ఆపరేషన్ గాయం పచ్చిగా మారిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ తెలిపారు…

అచ్చెన్న హెల్త్ బులిటెన్ విడుదల.. ఈఎస్‌ఐ స్కాంలో మరో అరెస్ట్
మాజీ మంత్రి అచ్చెన్నాయుడి హెల్త్ బులెటిన్‌ విడుదలైంది. ఆయన శ్రీకాకుళం నుంచి విజయవాడకు సుదీర్ఘ ప్రయాణం చేయడంతో ఆపరేషన్ గాయం పచ్చిగా మారిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ తెలిపారు. ఆ గాయానికి చికిత్స అందిస్తున్నామని.. అవసరమైతే మరోసారి ఆపరేషన్ చేస్తామన్నారు.

ఏపీలో సంచలనంరేపుతున్న ఈఎస్‌ఐ స్కాంలో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో పక్కా ఆధారాలు సేకరించామని..

అవకతవకలు జరిగినట్లు గుర్తించి మాజీ మంత్రులు అచ్చెన్నాయుడితో పాటూ మిగిలినవారిని అరెస్ట్‌ చేశామన్నారు ఏసీబీ జేడీ రవికుమార్.

ఈఎస్‌ఐ స్కాంకు సంబంధించి రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని.. ఈ కేసులో ఇప్పటి వరకు డైరెక్టర్లు విజయ్ కుమార్, రమేష్ కుమార్.. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు.. జేడీ జనార్ధన్.. ఉద్యోగులు చక్రవర్తి, వెంకట్రావు, రమేష్ బాబు అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. ఈ రెండు కేసుల్లో ఏ1గా రమేష్ కుమార్, ఏ2గా

అచ్చెన్నాయుడు ఉన్నారని తెలిపారు. వారిని జడ్జి ముందు హాజరుపరిచామని.. వారికి రిమాండ్ విధించారన్నారు.

ఈ స్కాంలో ఇప్పటి వరకు 19 మంది ముద్దాయిలను గుర్తించామని.. మరింత మందిని విచారణ చేస్తామన్నారు. మరికొన్ని డాక్యుమెంట్స్ పరిశీలించాల్సి ఉందన్నారు.

ఈ వ్యవహారంలో ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఎక్కువగా ఉందని.. అచ్చెన్నాయుడు లెటర్ ల్యాడ్ ద్వారా ఆర్డర్లు ఇవ్వాలని ఆదేశించారని.. కొనుగోళ్లు, టెలీ మెడిసిన్‌కి సంబంధించి విడి విడిగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసామన్నారు ఏసీబీ జేడీ.

మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి వైద్యం చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారని.. డాక్టర్ల బృందం ఆయనకు వైద్యం చేసిందన్నారు. ఇటు అచ్చెన్నాయుడు, రమేష్ కుమార్ తరపున హౌస్ మోషన్ పిటిషన్లు వేశారని తెలిపారు.

ఆ గాయం తగ్గడానికి రెండుమూడు రోజులు పట్టొచ్చంటనున్నారు. బీపీకి మందులు వాడుతున్నామని.. షుగర్ మామూలుగా ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *