ఇప్పుడు ఆ డీఎన్ఏ ఇరు దేశాల్లోనూ మాయమైందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.

భారత్, అమెరికాల్లో ఆ డీఎన్ఏ మాయమవుతోంది.. రాహుల్ గాంధీ
కరోనా నుంచి ప్రపంచం బయటికి వచ్చాక అంతర్జాతీయ సమాజం బాధ్యతగా తీసుకొని ప్రతి అంశంపై కలిసి పనిచేయగలుగుతుందా అనేది అతి పెద్ద సవాలని తాను అనుకుంటున్నట్లుగా రాహుల్ అన్నారు.

భారత్, అమెరికా దేశాలకు ఇప్పటిదాకా సహనం ఎక్కువ ఉన్న దేశాలుగా పేరుండేదని, ఇప్పుడు ఆ డీఎన్ఏ ఇరు దేశాల్లోనూ మాయమైందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.

అమెరికాకు చెందిన మాజీ దౌత్యవేత్త నికోలస్‌ బర్న్స్‌తో జరిపిన సంభాషణలో భాగంగా ఆయన ఈ విధంగా స్పందించారు.

‘‘మా దేశం ఎక్కువ సహనం గలది. మేం ఎలాంటి దాపరికం లేకుండా ఓపెన్‌గా ఉంటాం.

దీని తాలూకు డీఎన్ఏ ఇప్పుడు మాయమైపోతోంది. నేను ఎప్పుడూ చూసే సహనపు స్థాయి ఇప్పుడు కనిపించడం లేదు. ఇందుకు బాధపడుతున్నాను.

అమెరికాలోనూ, ఇండియాలోనూ ఈ సహనం కనిపించడం లేదు.’’ అని రాహుల్ పేర్కొన్నారు.

అంతేకాక, కరోనా వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. ‘‘దేశంలో కఠినమైన లాక్‌ డౌన్‌ను విధించారు. ఇప్పుడు దీని ఫలితాలను అంతా చూస్తున్నారు.

వలస కార్మికులు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఈ నాయకత్వం చాలా విఘాతం కలిగిస్తోంది. గత కొన్ని వేల సంవత్సరాలుగా ఈ డీఎన్‌ఏ ఒకే రకంగా ఉంది.

కొవిడ్ 19 కారణంగా ఇప్పుడు మేం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ప్రస్తుతం గతంలో కంటే ప్రజలు ఒకరికొకరు సహకరించుకోవడాన్ని చూశాను’’ అని రాహుల్ అన్నారు.

కరోనా నుంచి ప్రపంచం బయటికి వచ్చాక అంతర్జాతీయ సమాజం బాధ్యతగా తీసుకొని ప్రతి అంశంపై కలిసి పనిచేయగలుగుతుందా అనేది అతి పెద్ద సవాలని తాను అనుకుంటున్నట్లుగా రాహుల్ అన్నారు.

చైనా గురించి మాట్లాడుతూ.. ఆ దేశం ప్రగతి సాధిస్తోందని.. అందులో అనుమానమేం లేదని అన్నారు. భారత్, అమెరికా దేశాల్లా కాకుండా అక్కడ ప్రజలను భయంతో అదుపుచేస్తారని వ్యాఖ్యానించారు.’’ అని రాహుల్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *