మంత్రి వెల్లంపల్లి అసలు సభలో సభ్యుడే కాదని..ఎక్కడైనా యాక్షన్ ఉంటే అక్కడ రియాక్షన్ ఉంటుందని యనమల వ్యాఖ్యానించారు.

మంత్రి వెల్లంపల్లి మండలికి ఎందుకొచ్చారు.. లోకేష్‌ను కొట్టాలనుకున్నారు: యనమల
కౌన్సిల్‌లో ఇంత మంది మంత్రులు ఎందుకు వచ్చారన్నారు.

లోకేష్‌ను కొట్టాలనే ప్రయత్నం చూస్తే అడ్డుకోకుండా ఎలా ఉంటారు.. సాధారణంగా ప్రతిపక్షం గొడవ చేస్తుంది.. కానీ ఇక్కడ అధికార పక్షం గొడవ చేసిందన్నారు.

బుధవారం శాసనమండలిలో జరిగిన పరిణామాలపై మండలి ప్రతిపక్ష నేత యనమల స్పందించారు.

గతంలో సభల్లో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని.. తిట్ల పురాణంతో అధికార పార్టీ నేతలు గొడవకు దిగారని.. తిడుతుంటే ఎంతసేపు ఇతర సభ్యులు చూస్తారన్నారు.

మంత్రి వెల్లంపల్లి అసలు సభలో సభ్యుడే కాదని.. ఆయన ఎందుకు వచ్చి కూర్చున్నారని ప్రశ్నించారు.

కౌన్సిల్‌లో ఇంత మంది మంత్రులు ఎందుకు వచ్చారన్నారు. లోకేష్‌ను కొట్టాలనే ప్రయత్నం చూస్తే అడ్డుకోకుండా ఎలా ఉంటారు.. సాధారణంగా ప్రతిపక్షం గొడవ చేస్తుంది.. కానీ ఇక్కడ అధికార పక్షం గొడవ చేసిందన్నారు.

మంత్రుల భాష అలా ఉండొచ్చా.. ఎక్కడైనా యాక్షన్ ఉంటే అక్కడ రియాక్షన్ ఉంటుందని వ్యాఖ్యానించారు.

ఏ ప్రభుత్వమైనా అప్రోప్రియషన్ బిల్ కోసం పట్టు పడుతుందని.. కానీ నిన్న సభలో ప్రభుత్వ తీరు అందుకు భిన్నంగా ఉందన్నారు యనమల.

ప్రభుత్వానికి ఏ నెలాఖరులోగా అప్రోప్రియేషన్ బిల్ పాస్ అవ్వాలన్నారని.. తాము సహకరిస్తాం అని చెప్పామన్నారు.

బడ్జెట్ కంటే ఇతర అంశాలు ముఖ్యమైనవి అని ప్రభుత్వమే చెప్పడం విచిత్రంగా ఉందన్నారు.

ప్రభుత్వం ఏ దురుద్దేశంతో ఉందో అర్ధం కావడం లేదని.. తాను విధ్వంసం అనే మాట 38 ఏళ్లలో ఎప్పుడూ అనలేదన్నారు.

తనపై మంత్రి సుభాష్ చంద్రబోస్ ఆ మాట సృష్టించినట్లు ఉందన్నారు.

అంతేకాదు బిల్లులన్నీ సెలక్ట్ కమిటీ ముందు ఉన్నాయని.. గవర్నర్ కూడా తన ప్రసంగంలో ఈ విషయాన్ని చెప్పారని యనమల గుర్తు చేశారు.

మూడు నెలలు అయ్యింది కాబట్టి.. బిల్స్ పాస్ చూసుకుంటామంటే కుదరదన్నారు.

అప్రోప్రియషన్ బిల్ పాస్ అవ్వక పోవడానికి ప్రభుత్వానిదే బాధ్యతని.. మనీ బిల్ కాబట్టి 14 రోజుల తరువాత ఆటోమాటిక్‌గా బిల్ పాస్ అవుతుందన్నారు. తాను రూల్ బుక్ దాటి ఎప్పుడూ వ్యవహరించ లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *