విశాఖలో వామపక్ష నేతలతో జనసేన పొత్తులకు చర్చలు
జనసేన వామపక్ష నేతలతో ఈ శుక్రవారం విశాఖలో పొత్తులకు చర్చలు ప్రారంభమయ్యాయి.
విశాఖ ఋషికొండ లోని సాయి ప్రియ నిలయంలో ఈరోజు ఉదయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సిపిఐ, సిపిఎం జాతీయ నాయకులు సమావేశం కానున్నారు.
సీట్ల సర్దుబాటు ఇతర అంశాలపై సమావేశంలో చర్చ సాగనుంది.
ఇదివరకే పవన్ తో ఒకసారి వామపక్ష నేతలు పొత్తులపై చర్చించారు. ఇప్పుడు రెండోసారి వామపక్షాల కొనసాగనున్నాయి.
ముందుగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి ఎక్కడ ఎక్కడ పోటీ చేయాలి అని అంశంపై చర్చించనున్నట్లు సమాచారం.
ఈ సమావేశంలో ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలి అనే అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.