లోటస్ పాండ్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి మరియు దగ్గుబాటి వెంకటేశ్వర రావు భేటీ

దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కుమారుడు హితేష్ చెంచురాం వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇరువురు కలిసి లోటస్ పాండ్ లో భేటీ అయ్యారు.

కొద్ది రోజులుగా దగ్గుబాటి ఫ్యామిలీ వైసీపీతో కలుస్తుంది అని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ భేటీ జరిగింది. ప్రకాశం జిల్లా పరుచూరు నుంచి దగ్గుబాటి కుమారుడు హితేష్ చెంచురాం వైసీపీ తరఫున పోటీ చేస్తారనే ప్రచారం స్థానికంగా జరుగుతుంది.

దగ్గుపాటి మరియు వైసీపీ వారిరువురి మధ్య 45 నిమిషాల పైగా భేటీ కొనసాగింది. ఈ భేటీలో భాగంగా లోటస్పాండ్లో ప్రస్తుతం దగ్గుబాటి వెంకటేశ్వరరావు తో పాటు షితేష్ చెంచురాం , విజయసాయిరెడ్డి , వై సి సుబ్బారెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

దగ్గుపాటి పార్టీకి సంబంధించిన కీలక నేతల ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు.

పరుచూరి నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తానని తన కుటుంబ సభ్యులకు స్పష్టం చేయడంతోఈభేటీ ఖరారయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *