ఏపీలో కరోనా కల్లోలం: 24 గంటల్లో ఏకంగా 425 కేసులు.. రెండు మరణాలు
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 13,923 శాంపిల్స్ పరిశీలిస్తే 299మందికి కరోనా పాజిటివ్గా తేలినట్లు మీడియా బులిటెన్లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇతర రాష్ట్రాలు (100), విదేశాల నుంచి (26) వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 425కేసులు నమోదయ్యాయి.
ఏపీని కరోనా పంజా విసురుతూనే ఉంది..
ఈ మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. వరుసగా పెరుగుతున్న కేసులు భయపెడుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 13,923 శాంపిల్స్ పరిశీలిస్తే 299మందికి కరోనా పాజిటివ్గా తేలినట్లు మీడియా బులిటెన్లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇతర రాష్ట్రాలు (100), విదేశాల నుంచి (26) వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 425కేసులు నమోదయ్యాయి.
కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం తెలియజేయలేదు.
తాజా కేసులు కలిపితే రాష్ట్రానికి సంబంధించిన కేసులు 5854కు (మొత్తం7, 496కు) చేరాయి.
మరో 77మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2779కు చేరింది.
రాష్ట్రవ్యాప్తంగా కర్నూలు జిల్లాలో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి.
తర్వాత గుంటూరు జిల్లాలో 600కు పైగా కేసులు ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2983మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మొత్తం 92మంది చనిపోయారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఇద్దరు చనిపోయారు.
తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు.
రాష్ట్రంలో కొత్త నమోదైన పాజిటివ్ కేసుల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కమ్యులేటివ్ పాజిటివ్ కేసులు 1353(వీటిలో యాక్టివ్ కేసులు 611) ఉన్నాయని ప్రకటించారు.
అలాగే విదేశాల నుంచి వచ్చిన 289మందికి వైరస్ సోకినట్లు తెలియజేశారు.
ఇతర రాష్ట్రాలు విదేశాల నుంచి వచ్చిన వారితో టెన్షన్ వెంటాడుతోంది.
పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అందుకే ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహిస్తోంది.