కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ

Indian Congress

Indian Congress

పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం పట్టణ కాంగ్రెసు కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బోయిన భానుమూర్తి యాదవ్ మాట్లాడుతూ చత్తీస్ ఘడ్, మద్యప్రదేశ్ , రాజస్థాన్ రాష్ర్ట లలో కాంగ్రెసు పార్టీ గెలిచిన వేంటనే రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేసిందన్నారు.

రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లో ప్రధానమంత్రి అయిన వెంటనే దేశవ్యాప్తంగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు

మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దేశవ్యాప్తంగా రైతులకు రెండు లక్షల రూపాయలు వరకు రుణమాఫీ తో పాటు వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చెందేలా రాహుల్ గాంధీ ప్రణాళిక రూపొందిస్తారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి భాస్కర రావు, పట్టణ కమిటీ ఉపాధ్యక్షులు తుట్టా రమణ, ప్రధాన కార్యదర్శి మొగలపల్లి సుబ్బారావు, కోశాధికారి గున్నబాబు , అనకాపల్లి మండల ఎస్సీ సెల్ అద్యక్షులు కట్టమూరి నూక అప్పారావు , కాంగ్రెసు నాయకులు గైపూరి త్రిమూర్తులు, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలు వచ్చిన సమయంలోనే రైతులు – రైతు సమస్యలు – రుణమాఫీ .. ఆయా పార్టీలకు గుర్తుకు వస్తాయి. రైతు రుణమాఫీ తో అనర్థాలు అంత భారత హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్

ఎంఎస్ స్వామినాథన్… భారత్ హరత విప్లవ పితామహుడు. దేశం నేడు ధాన్యం నిల్వల -తో సుభిక్షంగా ఉండటంలో ఆయన కృషి ఎంతో. అలాంటి వ్యక్తి తాజాగా మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో లబ్ది కోసం రాజకీయ పార్టీలు రుణమాఫీ మంత్రాన్ని జపిస్తూండడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చిన సమయంలోనే రైతులు – రైతులు సమస్యలు – రుణమాఫీ… ఆయా పార్టీలకు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాల్ని రద్దు చేస్తాం అంటూ నేతలు చేస్తున్న ప్రకటనపై ఆయన గట్టిగా స్పందించారు. రుణమాఫీ చిట్కా ఆర్థికంగ ఆచరణ సాధ్యం కాదని చెప్పారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం – ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రుణమాఫీని ఉపయోగించుకోవద్దని నేతలకు హితవు పలికారు. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్ , చత్తీస్గఢ్ లో, అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ రైతుల రుణాలను మాఫీ చేయడం – వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీలు రుణమాఫీ చేస్తామని ప్రకటించడం పై స్వామినాధన్ ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభం అనేది ఆర్థిక పరమైన సమస్య చిన్న రైతులు నిలదొక్కుకోవాలంటే వర్షాలు మార్కెట్లో అత్యంత ప్రధానమైనవి. ఎన్నికల్లో లబ్ది కోసం రాజకీయ నేతలు ఆర్థికంగా అనాచార సాథ్యంకాని హామీలను ప్రోత్సహించకూడదు అని పేర్కన్నారు

రైతుల రుణాలు రద్దు వ్యవసాయ విధానంలో భాగం కాకూడదని స్వామినాథన్ చెప్పారు. రైతుల తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం లేని సంక్లిష్ట పరిస్థితుల్లో మాత్రమే సందర్బాన్ని బట్టి రుణాల్ని రద్దు చేయాలని సూచించారు. ఆర్థికంగా లాభదాయకం గా ఉండేలా చేయడానికే వ్యవసాయ విధానంలో అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రాజకీయ నాయకులు విధానం గురించి ఆయన తీవ్రంగా స్పందించారు ఎన్నికలు వచ్చినప్పుడే రైతుల సమస్యలు గుర్తుకు వచ్చే విధానం వ్యవసాయ రంగానికి తీవ్ర హాని చేస్తుందని చెప్పారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వాలకు స్పష్టమైన ప్రణాళిక ఉంటేనే కనీస మద్దతు ధర సమర్థంగా అమలవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బందులు ఉండవు. అలాగే ధాన్యం సేకరణ ధరల విధానం -ప్రజా పంపిణీ విధానం పై అంతర్గతంగా ఒక పాలసీని అమలు చేయాలీ. కనీస మద్దతు ధర ధన్యం సేకరణ ఆచరణలో అనేది రైతులుకు ఆర్థికంగా లాభసాటిగా ఉండాలి. రైతులు ఆర్థిక స్థతిగతుల్నీ మార్చేలా ప్రభుత్వ విథానాలు ఉండాలి. వ్యవసాయం అనేది ఆకర్షణీయమైన ఉద్యోగంగా మారి నేటి యువతను ఆకర్షంచినప్పుడే ఈ రంగంలో పురోభివృద్ధి సాధ్యమవుతుంది అని స్వామినాథన్ పేర్కొన్నారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *