ఈ నెల 15న రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని జగన్ ఆహ్వానించారు…
1.రైతు భరోసా.. ప్రధాని మోదీకి జగన్ ఆహ్వానం
2.రైతు భరోసా పథకం కింద రైతులకు రూ.12,500 పెట్టుబడి నిధి అందించేందుకు జగన్ సర్కార్ నిర్ణయించింది.
3.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని జగన్ ఆహ్వానించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానితో చర్చించారు.
ఈ నెల 15న రైతు భరోసా కార్యక్రమ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీని సీఎం జగన్ ఆహ్వానించారు.
అలాగే పోలవరం రివర్స్ టెండర్లపై ప్రధానితో చర్చించినట్లు తెలుస్తోంది.
రివర్స్ టెండరింగ్ ద్వారా సుమారు రూ.800 కోట్లు ఆదా చేసినట్లు ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు రెవెన్యూ లోటు భర్తీకి నిధులు ఇవ్వాలని కోరారు.
రైతు భరోసా పథకం కింద వ్యవసాయ కుటుంబాలకు రూ.12,500 పెట్టుబడి నిధి అందించేందుకు సీఎం జగన్ నిర్ణయించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని జగన్ ఆహ్వానించారు.
ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని జగన్ అందజేశారు. సుమారు 50 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే ఈ పథకం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానిని జగన్ కోరారు.
ప్రధానంగా అదనపు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోసం జగన్ విజ్ఞప్తి చేశారు.
కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.61,071.51 కోట్ల రూపాయలు అవసరమవుతాయని గత ప్రభుత్వం ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్లో పేర్కొందని..
ఈ ఏడాది (2019–20)లో తమ ప్రభుత్వం సమర్పించిన పూర్తి స్థాయి బడ్జెట్లో ఇదే విషయాన్ని చెప్పామని.. కానీ ఇప్పటి వరకూ కేంద్రం నుంచి వచ్చింది రూ. 6,739 కోట్లు మాత్రమేనని..
గత ప్రభుత్వం వివిధ పనులు, బిల్లులకు సంబంధించి రూ.50 వేల కోట్లు పెండింగ్లో పెట్టిందని..
సకాలంలో నిధులు విడుదల చేసి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు.
అందుకే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద వీటికి అదనంగా మరో రూ.40 వేల కోట్లు ఇవ్వాలని కోరారు.
2014–15లో రాష్ట్రాన్ని విభజించిన సమయంలో రెవిన్యూ లోటు రూ.22,948.76 కోట్లుగా కాగ్ అంచనా వేసింది. కానీ ఇప్పటి వరకూ రూ.3,979.50 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి నిధులు వచ్చాయి.
ఇంకా రూ.18,969.26 కోట్లు రావాల్సి ఉంది. రెవెన్యూ లోటు కింద ఇవ్వాల్సిన రూ.18,969.26 కోట్ల నిధుల్ని వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరారు.
పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాలు ఆమోదించాలని కోరారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సవరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని..
రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులు రూ.5,103 కోట్లను ప్రాజెక్టుకోసం ఖర్చు చేసిందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
ఆ నిధుల్ని తక్షణమే రీయింబర్స్ చేయాల్సి ఉందని చెప్పారు.
ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి మరో రూ.16 వేల కోట్లు విడుదల చేయాలని కోరారు.
ప్రాజెక్టు కోసం ఇంకా భూసేకరణ, పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయాల్సి ఉందని..
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల మొత్తం రూ. 55,548 కోట్లు ఆమోదించాలని కోరారు.
ఇక రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.838 కోట్లు ఆదా చేశామని ప్రధానికి జగన్ తెలియజేశారు.
2014–19 మధ్య పోలవరం పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో నిపుణుల కమిటీ వేశామని..
ఆ నిపుణుల కమిటీ అభిప్రాయం మేరకు పాత కాంట్రాక్ట్లను రద్దు చేసి.. రివర్స్ టెండరింగ్ను నిర్వహించామన్నారు.
పోలవరం ప్రాజెక్టు పనులను రివర్స్ టెండరింగ్ చేయడం ద్వారా దాదాపు రూ.838 కోట్లు ఆదా అయ్యాయన్నారు.
వెనుకబడ్డ జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని బుందేల్ఖండ్, కలహండి తరహాలో ప్రకటించారని.. జిల్లాలు, వాటి ఖర్చు ప్రాతిపదికన ఈ ప్యాకేజీని రూపొందించారన్నారు.
ఆ మేరకు యూపీలోని బుందేల్ఖండ్, కలహండిలో తలసరి రూ.4 వేలు కేటాయించారని గుర్తు చేశారు.
ఏపీలో మాత్రం ఆ మొత్తం కేవలం రూ.400 మాత్రమే నని.. అందుకే ఈ ప్యాకేజీ మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు జగన్.
రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 వెనుకబడ్డ జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ. 50 కోట్ల చొప్పున ఈ 6 ఏళ్లలో రూ.2100 కోట్లు రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకూ రూ.1050 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు.
కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులకు ఆర్థిక సాయం, నవరత్నాలుకు చేయూతనివ్వాలని కోరారు. అలాగే ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.