సీఎం జగన్ ఏరియల్ సర్వే: పంటలన్నీ నీట మునిగి..వారందరికి రూ.2వేలు చొప్పున సాయం.. మనసు కలిచివేసే దృశ్యాలు

వరదలపై సీఎం జగన్ సమీక్ష.. వారందరికి రూ.2వేలు చొప్పున సాయం

ముంపు బాధితుల పట్ల మానవత్వంతో, ఉదారంగా వ్యవహరించాలని కోరారు. మన ఇంట్లో సమస్యగానే భావించి వారికి అండగా నిలవాలని.. ఖర్చు విషయంలో రాజీ పడొద్దన్నారు.

వరదలపై సీఎం జగన్ సమీక్ష.. వారికి రూ.2వేలు సాయం

ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీగియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రస్తుత వరద పరిస్థితులపై ఆరా తీశారు. అధికారులకు సీఎం కొన్ని సూచనలు చేశారు. ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కొంటికి రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని ఆదేశించారు.

ముంపు బాధితుల పట్ల మానవత్వంతో, ఉదారంగా వ్యవహరించాలని కోరారు. మన ఇంట్లో సమస్యగానే భావించి వారికి అండగా నిలవాలని.. ఖర్చు విషయంలో రాజీ పడొద్దన్నారు.

అధికారులంతా సహాయ పునరావాస కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని.. తాను ఏరియల్‌ సర్వేకు వెళ్తున్నాను అన్నారు.

తాను వెళ్తున్నాను కాబట్టి కలెక్టర్లు, ఇతర అధకారులు సహాయ పునరావాస కార్యక్రమాలను వదిలి రావాల్సిన అవసరంలేదన్నారు. సహాయ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలనిజ.. వారు ఇస్తున్న క్షేత్రస్థాయి సమాచారంపై వెంటనే చర్యలు తీసుకోవాలి అన్నారు.

క్షేత్రస్థాయిలో వారు గమనించిన అంశాలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. వరద తగ్గుముఖం పట్టగానే 10 రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలని.. విద్యుత్, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలన్నారు.

1. తూర్పు గోదావరి జిల్లాలో 95 క్యాంప్‌లలో 14,477 మందికి వసతి కల్పించామని, 105 గ్రామాలలో వరద ప్రభావం ఉందని, 77 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని, ఆయా గ్రామాలలో 30 వేల కుటుంబాలు ఉన్నాయని తెలిపిన జిల్లా కలెక్టర్‌.
2. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో 26 శిబిరాల నిర్వహిస్తుండగా వాటిలో 5 వేల మంది వసతి పొందుతున్నారని జిల్లా అధికారులు తెలిపారు. జిల్లాలో 71 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోగా, ఆయా గ్రామాలలో 10 వేల కుటుంబాలు ఉన్నాయని చెప్పారు.
3. ఇంకా సహాయ, పునరావాస పనుల కోసం తూర్పు గోదావరి జిల్లాలో 9 లాంచీలు, 136 బోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 లాంచీలు, 36 బోట్లు వినియోగిస్తున్నట్లు తెలిపిన కలెక్టర్‌.
4. పశ్చిమ గోదావరి జల్లాలో 2 లక్షల మంచినీటి ప్యాకెట్లు ఇచ్చామన్న అధికారులు, గిరిజనులకు లాంచీలలో కూరగాయలు కూడా సరఫరా చేశామని చెప్పారు.
5. అత్యవసర సేవలు నిలిచిపోకుండా జరేటర్లు వినియోగిస్తున్నామని తెలిపిన కలెక్టర్లు.
6. సేవలకు అంతరాయం లేకుండా వీలైనన్ని ఎక్కువ వినియోగించుకోవాలన్న సీఎం.

నిత్యావసరాలు సరిగ్గా అందిస్తున్నారా? లేదా? అని సీఎం ప్రశ్నించగా, శిబిరాల్లో క్వాలిటీ ఫుడ్‌ ఇస్తున్నామని, పిల్లలకు పాలు, బ్రెడ్డు, బిస్కట్లు ఇస్తున్నామని, కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నామని, మాస్కులు, శానిటైజర్లు అందజేస్తున్నామని అధికారులు తెలిపారు.

ఎన్డీఆర్‌ఎఫ్‌. ఎస్డీఆర్‌ఎఫ్‌:
1. వరద ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల కోసం అందుబాటులో ఉన్న ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సరిపోతున్నారా? అని సీఎం ఆరా
2. ఇప్పుడున్న బృందాలు సరిపోతాయన్న కలెక్టర్లు.
3. స్టాండ్‌ బై కింద కొంతమందిని పెట్టుకోవాలని సీఎం సూచన.
4. రేషన్‌ సరఫరాపైనా ఆరా తీసిన సీఎం, పంపిణీలో ఎక్కడా, ఏ లోటు ఉండకూడదని, పశువుల దాణా కూడా సరఫరా చేయాలని స్పష్టంచేసిన సీఎం.

వరద తగ్గుముఖం పట్టాక..:
1. వరద తగ్గిన తర్వాత మరో పోరాటం చేయాల్సి ఉంటుందన్న సీఎం
2. వరద తగ్గుముఖం పట్టగానే ముమ్మరంగా పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని ఆదేశం.
3.తాగునీటిని క్లోరినేషన్‌ చేయాలని, అన్ని చోట్ల పారిశుద్ధ్యం లాంటి పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, వైద్య ఆరోగ్య శిబిరాలు కూడా నిర్వహించాలని, లేని పక్షంలో రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని అప్రమత్తంచేసిన సీఎం.
4. వరద తగ్గుముఖం పట్టగానే 10 రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలని, ఆ మేరకు ఎన్యుమరేషన్‌ 10 రోజుల్లోగా చేయాలని, విద్యుత్, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు.


సీఎం జగన్ ఏరియల్ సర్వే: పంటలన్నీ నీట మునిగి.. మనసు కలిచివేసే దృశ్యాలు

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు.
గోదావరి జిల్లాల్లో మనసు కలిచివేసే విజువల్స్.. సీఎం జగన్ ఏరియల్ సర్వే

గోదావరికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. దీంతో లోతట్టు గ్రామాలన్నీ ముంపునకు గురవుతున్నాయి.

ముఖ్యంగా వరద ప్రభావంతో పంట పొలాలన్నీ మునిగిపోయాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి పేర్ని నాని ఉన్నారు.

అంతకుముందు గోదావరి వరద పరిస్థితులపై ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

వరద పరిస్థితులపై కలెక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ‘‘అధికారులంతా సహాయ పునరావాస కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని, తాను ఏరియల్‌ సర్వేకు వెళ్తున్నట్లు చెప్పారు.

తాను ఏరియల్ సర్వేకు వెళ్తున్నాను కాబట్టి, మీరు సహాయ పునరావాస కార్యక్రమాలను వదిలిరావాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. అందుకే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిస్తున్నానని’ ఆయన అన్నారు.

సీఎం జగన్ ఏరియల్ సర్వేలో మనసు కలిచివేసే విజువల్స్ కనిపించాయి. పంటపొలాలన్నీ నీట మునిగిపోయాయి.

లోతట్టు గ్రామాలన్నీ జల దిగ్బంధంతో చిక్కుకుపోయాయి. ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. కాగా, గోదావరి జిల్లాలో పరిస్థితులు చూసి చలించిపోయిన సీఎం జగన్.. ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కొంటికి రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని ఆదేశించారు.

ముంపు బాధితుల పట్ల మానవత్వంతో, ఉదారంగా వ్యవహరించాలని కోరారు. మన ఇంట్లో సమస్యగానే భావించి వారికి అండగా నిలవాలని.. ఖర్చు విషయంలో రాజీ పడొద్దన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *