ప్రవాసాంధ్రుల సంక్షేమ బాధ్యత మాది అంటున్న సీఎం చంద్రబాబు
విదేశాల్లోని ప్రతి ఆంధ్రుని సంక్షేమ బాధ్యతను తమ ప్రభుత్వం సేకరిస్తుందని బుధవారం ప్రవాసాంధ్ర దివాస్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు, గల్ఫ్ దేశాల్లో నీ తెలుగు వారి ఇబ్బందులను పరిగణిస్తూ ఉచిత ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని చేపట్టనున్నారు దేశంలోనే తొలిసారి ఈ సౌకర్యం ఏపీలో అమలు చేస్తున్నామని చెప్పారు, భీమా పథకం లో చేరితే తెల్లని రేషన్ కార్డు తొలగిస్తారని అపోహలని సీఎం స్పష్టం చేశారు, విదేశాల్లోని తెలుగు వారంతా ఈ పథకం పరిధిలో నమోదు చేసుకోవాలని సూచించారు, గల్ఫ్ ప్రాంతంలో ఎనిమిది లక్షల మంది తెలుగువారు ఉన్న ఉద్యోగ ఉపాధి సదుపాయాలు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పారు, మరికొంతమంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోగా వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంస్థ ఏపీ ఎన్ ఆర్ టి కు వీరి బాగోగులు చూసే బాధ్యత అప్పగించామన్నారు, దీనికి 166 దేశాలలో 1.5 లక్షల మంది సభ్యులు ఉన్నారని సీఎం తెలిపారు, ప్రవాసాంధ్రుల బాధ్యతకు సీఐడీ విభాగంలో ఎన్నారై పోలీస్ సెల్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని చెప్పారు,
- భరోసా బీమా పథకం లబ్ధి వివరాలు:
- ప్రమాదంలో మరణం అంగవైకల్యం సంభవిస్తే 10 లక్షలు, గాయపడ్డవారికి లక్ష, ఉద్యోగాల్లో యజమానులతో వివాదాల పరిష్కారానికి నాయి సాయం 45000, ఉద్యోగం కోల్పోతే తిరిగి రాష్ట్రానికి రావడానికి విమాన టిక్కెట్ కర్చు, ప్రస్తుతి సాయం 50000, ప్రవాసాంధ్ర దివాస్ కరపత్రం విడుదల ప్రవాసాంధ్ర దివాస్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఉండవల్లిలో ప్రజావేదిక లో ఏ పీ ఎన్ ఆర్ టి ద్వారా ప్రవాసాంధ్రులకు అందించే సేవల కరపత్రాన్ని విడుదల చేశారు, ఏపీ ఎంఆర్పి ద్వారా యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ అందిస్తామని ఆయన చెప్పారు,
- అమరావతిలో ప్రారంభించనున్న అంతర్జాతీయ నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో శిక్షణ కు అంతర్జాతీయ స్థాయి ఏజెన్సీలను సర్వీస్ ప్రొవైడర్లు నిర్మించుకోవాలని ఏ పి ఎన్ ఆర్ డి అధికారులకు సూచించారు, రాష్ట్ర విభజన తర్వాత విదేశాల నుంచి అమరావతి కి వచ్చి పరిశ్రమ స్థాపించిన పలువురు పారిశ్రామికవేత్తలు సీఎం అభినందించారు, కార్యక్రమంలో ఏ పి ఎన్ ఆర్ టి ఎండి రవి కుమార్ పాల్గొన్నారు,