సీఎం చంద్రబాబుపై సినీ నటులు ఆర్.నారాయణమూర్తి విమర్శల వర్షం గుప్పించారు!
కేంద్రంపై చంద్రబాబు చేస్తున్న పోరాటం, నాలుగేళ్ల క్రితం చేసి ఉంటే హోదా వచ్చేది అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబుపై ఆర్.నారాయణమూర్తి విమర్శలు గుప్పించారు.
హోదా ఇచ్చేవారికి ఏపీ ప్రజలు ఓట్లు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీకి మొదటినుంచి అన్యాయం జరుగుతూనే ఉంది ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చేపిన నేతలు ఏమైపోయారు అని ప్రశ్నించారు.
తిరుమల వెంకన్న సాక్షిగా ప్రధాని మోడీ హామీ ఇచ్చిన మాట తప్పారని ఆరోపించారు.
ఉత్తరాంధ్ర కు ఋందేల్ ఖ్oడ్ తరహాలో ప్యాకేజీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ పై కేంద్రం ఎందుకు నిర్ణయం తీసుకోలేదని నారాయణమూర్తి దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంపై ఇప్పుడు చేస్తున్న పోరాటం నాలుగేళ్ల కిందట చేసి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి ఉండేవారమని విప్లవ సినీనటుడు నారాయణమూర్తి అన్నారు.
దేశంలో ఏ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం నాడు పార్లమెంట్లో హామీలు ఇచ్చి నేతలంతా ఏమైపోయారు అని ప్రశ్నించారు.