18 కేసులు ఉన్న చింతమనేనిని ప్రభాకర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై… చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు…

‘ఏ కేసు వచ్చినా హడావిడిగా స్టేలు తెచ్చుకోవడం కాదు.. ధైర్యముంటే.. నిజంగా నిప్పు అని భావిస్తే స్టేలు తొలగించుకుని విచారణకు సిద్ధం కావాలి.

ప్రపంచంలోనే అవినీతిపరుడు చంద్రబాబు అని నిరూపణకాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.’

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.

మొన్నటి వరకూ దాడులు.. నిన్న ఇసుక.. ఇప్పుడేమో ఇంగ్లిష్.. అన్నింటినీ రాజకీయం చేస్తున్నారని, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

తాను అధికారంలో ఉన్నప్పుడు కాల్‌‌మనీ సెక్స్‌ రాకెట్‌ నిందితులను వదిలేయాలని చంద్రబాబు చెప్పారని ఆరోపించారు.

ఈ రోజు ఆధారాలతో సహా కేసులు పెడుతుంటే తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ లబోదిబోమంటున్నారని ఎద్దేవా చేశారు.

కులమతాలను రెచ్చగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే క్రిస్టియానిటీ కోసమంటూ దుర్మర్గపు ప్రచారానికి తెరతీశారని.. అసలు మనుషులా? రాక్షసులా? అనిపిస్తోందన్నారు.

హిందూత్వం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు.. ఆయన హయాంలో జరిగిన దేవాలయాల కూల్చివేతకు సమాధానం చెప్పాలన్నారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తెలుగుపై ప్రేమలేదని క్రియేట్‌ చేసేందుకే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు.

అక్రమ కేసులు పెడుతున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. టీడీపీ నేతల దౌర్జన్యాలపై కేసులు పెట్టకూడదా? అని ప్రశ్నించారు.

పోలీసులను సైతం చంద్రబాబు బ్లాక్‌ మెయిల్‌ చేసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ పాలనలో ఎంతపెద్ద వ్యక్తి తప్పుచేసినా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

నాకే నోటీసులు ఇస్తారా అని మాట్లాడుతున్నారని.. చంద్రబాబేమైనా చట్టానికి అతీతుడా అని ప్రశ్నించారు. తప్పుచేస్తే నోటీసులు ఇస్తారని..కేసులు కూడా పెడతారని స్పష్టం చేశారు.

చింతమనేని ప్రభాకర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. 18 కేసులు ఉన్న చింతమనేనిని బాబాగా అభివర్ణిస్తున్నారని.. చంద్రబాబు వ్యాఖ్యలు అరాచకాలను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిని తప్పుబట్టారు. చింతనిప్పులా ఉండే చింతమనేని ప్రభాకర్‌పై కేసులు పెడతారా అంటూ యనమల ప్రశ్నిస్తున్నారని సెటైర్లు వేశారు.

ప్రజలు సంతోషంగా ఉంటే.. చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. టీడీపీకి 23 స్దానాలు ఇచ్చినందుకు ప్రజలు చింతిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఆయన తనయుడు లోకేష్ పనీపాటా లేకుండా రోజూ ట్వీట్లు చేస్తుంటాడంటూ ధ్వజమెత్తారు. దొంగపేపర్, మాయ టీవీ అని వయస్సుకు మించిన మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్‌ వల్లే చంద్రబాబుకు ఈ పరిస్దితి దాపురించిందని.. ఇంకా అలాగే మాట్లాడితే టీడీపీ క్లోజ్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *