మా పార్టీ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేసినప్పుడు ఈ సుమతీ శతకాలు ఏమయ్యాయి చంద్రబాబు?

‘వైసీపీ ఎమ్మెల్యేల్ని కొన్నప్పుడు ఈ సుమతీ శతకాలు ఏమయ్యాయి బాబూ’
మా పార్టీ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేసినప్పుడు ఈ సుమతీ శతకాలు ఏమయ్యాయి చంద్రబాబు? 40 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఎక్కడో ప్రధాని అంటే అమరావతిలో కూర్చుని పళ్లుకొరుకుతున్నారు.

మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలకు విజయసాయి కౌంటర్
వైసీపీ ఎమ్మెల్యేలను కొన్నప్పుడు సుమతీ శతకాలు ఏమయ్యాయి
అనర్హులుగా ప్రకటించాల్సిన స్పీకర్ అడ్డుపడితే నైతికత గుర్తు రాలేదా

టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. 40మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ.. మోదీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ ఘాటుగా ట్వీట్లు చేశారు. చంద్రబాబు ట్వీట్లకు విజయసాయి కౌంటరిచ్చారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే చంద్రబాబు.. వైసీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో ఎలా చేర్చుకున్నారంటూ ప్రశ్నించారు.

విజయసాయి తన ట్వీట్‌లో ‘మా పార్టీ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేసినప్పుడు ఈ సుమతీ శతకాలు ఏమయ్యాయి చంద్రబాబు?

40 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఎక్కడో ప్రధాని అంటే అమరావతిలో కూర్చుని పళ్లుకొరుకుతున్నారు. అనర్హులుగా ప్రకటించాల్సిన స్పీకర్ పెద్ద పాలేరులా అడ్డుపడితే నైతికత గుర్తు రాలేదెందుకో?’ అన్నారు.

‘చివరాఖరున చంద్రబాబు చేసిన మరో ఘోర తప్పిదం సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యం గారిని ధూషించడం.

ఓటమి దగ్గరపడిందన్న ఫ్రస్టేషన్ లో ఆయనపై నోరు పారేసుకున్న ఫలితం ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది సారుకు. తవ్వకుండానే బయట పడుతున్న ఆర్థిక అవకతవకలు రేపు గద్దె దిగిన తర్వాతా బాబును వెంటాడతాయి’అన్నారు.

‘రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తామని చెబుతుంటే.. అభివృద్ధిలో అనుకున్నాం.. అప్పుల్లోనా’అంటై సైరా పంచ్ విసిరారు. తప్పిదం సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యం గారిని ధూషించడం.

ఓటమి దగ్గరపడిందన్న ఫ్రస్టేషన్ లో ఆయనపై నోరు పారేసుకున్న ఫలితం ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది సారుకు. తవ్వకుండానే బయట పడుతున్న ఆర్థిక అవకతవకలు రేపు గద్దె దిగిన తర్వాతా బాబును వెంటాడతాయి’అన్నారు.
‘రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తామని చెబుతుంటే.. అభివృద్ధిలో అనుకున్నాం.. అప్పుల్లోనా’అంటై సైరా పంచ్ విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *