దీక్షల పేరుతో చంద్రబాబు దుబారా ఖర్చులు

రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉందంటూనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక దుబారా ఖర్చులకు పాల్పడుతున్నారు.

పార్టీ కార్యక్రమాలకు, వ్యక్తిగత పర్యటనకు సైతం రాష్ట్ర ప్రభుత్వ నిధులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు.

తాజాగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది అంటూ దేశ రాజధాని ఢిల్లీలో చంద్రబాబు దీక్ష సిద్ధమయ్యారు.

ఈ దీక్షకు భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. ఢిల్లీ దీక్షకు జనాలను తరలించేందుకు 10 కోట్లు ఖర్చు చేయాలని ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది.

టిడిపి నేతలు ,ఉద్యోగులను ఢిల్లీ తీసుకెళ్లేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ దీక్ష కోసం 1.12 కోట్లతో శ్రీకాకుళం ,అనంతపురం నుంచి రెండు ప్రత్యేక రైళ్లను సిద్ధం చేశారు.. అంతేకాక విమానాలు ఇతర రవాణా నాకు రెండు కోట్లు ,భోజనాలు వసతులు పబ్లిసిటీ కి 8 కోట్లు కేటాయించినట్లు తెలిసింది.

దీక్షకు ఉద్యోగులను భారీగా తరలించేందుకు ఉద్యోగ సంఘాలకు సీఎంవో టార్గెట్ కూడా ఇచ్చింది.

ఇవే కాక గడిచిన నాలుగునర సoరలలొధర్మపోరాట దీక్షలు పేరిట చంద్రబాబు ప్రభుత్వం భారీగా ప్రజాధనం వృధా చేసిన సంగతి తెలిసిందే.

ఎన్నికల నేపథ్యంలో ఓట్లు దండుకోవడానికి చంద్రబాబు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయడం పై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *