పార్టీలు మార్చిన బాబు ఇప్పుడు రంగులు కూడా మారుస్తున్నాడు అంటూ… బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
- నల్ల రంగు వేసుకుని వచ్చి నిరసన చేద్దామని అనుకున్న చంద్రబాబు… కేవలం ప్రజలకు కలరింగ్ ఇవ్వడం కోసమే అని ఎద్దేవా చేశారు.
నల్ల రంగు ప్యాంటు వేసుకుని అసెంబ్లీకి వచ్చి ప్రజల ముందు సింపతీ కొట్టేయాలని చూసిన బాబు హైటెక్ ఎత్తుగడను, బిజెపి విష్ణుకుమార్ రాజు తుస్సుమనిపించాడు.
నిన్న మొన్నటి వరకూ పార్టీలు మార్చిన బాబు ఇప్పుడు రంగులు కూడా మారుస్తున్నాడు అని అన్నారు.
రకరకాల రాజకీయాలను ఈ రాష్ట్ర ప్రజలు చాలా తక్కువ సమయంలోనే చూస్తున్నారు. రంగులు మారుస్తున్నారు ఇతర పార్టీల్లో ఉన్న వ్యక్తులను తీసుకొస్తున్నారు.
పార్టీలను మారుస్తున్నారు. ఏ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది అదే పార్టీతో ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఇవన్నీ చూస్తున్న తెలుగు ప్రజలు నివ్వెరపోతున్నారు అని అన్నారు.
కేవలం రకరకాల డ్రామాలతో మాత్రమే నిన్నటి వరకు చూసాము. కానీ ఇప్పుడు రకరకాల డ్రామాలు వేస్తున్నారు. పసుపు రంగు అంటే చాలా పవిత్రమైన రంగు అని గుర్తు చేశారు. అలాంటి పసుపు రంగు అన్యాయం చేసి ఎన్టీఆర్ ను మోసం చేశారు.
రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం ఎన్ని కోట్లు నిధులు ఇచ్చింది ఆర్థిక మంత్రిగా ఉన్న యనమలకు బాగా తెలుసని అందుకే ఆయన నల్ల రంగు షర్ట్ వేసుకోవడానికి ఒప్పుకోలేదు అని అన్నారు.