తిరుమలలో జరిగింది అన్యమత ప్రచారం కాదు

ఇది టీడీపీ మరియు టీడీపీ రహస్య అనుబంధ పార్టీలు ఈ ప్రభుత్వం పై చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే.

అవి గత టీడీపీ ప్రభుత్వం తమ ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం ప్రచురించినవే. ఆ టికెట్ బండిల్ ని అధికారులు చూసుకోకపోవడం వల్ల ఈ పొరపాటు జరిగింది. ఆ టికెట్లు కూడా ఒక్క బస్సులో మాత్రమే ఇవ్వడం జరిగింది.

ఈ విషయం తెలిసిన వెంటనే నిన్న మధ్యాహ్నమే అధికారులకు ఆదేశాలు జారీ చేసి వెంటనే ఆ టికెట్ బండిల్స్ ను వెనక్కు రప్పించడం జరిగింది. వాటికి ఈ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది కావాలనే ఈ ప్రభుత్వం చేసిందని కొంతమంది చేస్తున్న విమర్శలలో వాస్తవం లేదు.

ఒకవేళ ఇది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే దాని పై కూడా విచారణకు ఆదేశించాం, విచారణలో ఎవరైనా కుట్రపూరితంగా చేసారని తేలితే ఎంతటి వారి పైన అయిన కఠిన చర్యలు తీసుకుంటాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *