ఏపీ: కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.15వేలు సాయం.. జగన్ సర్కార్ జీవో
ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జీవో జారీ చేశారు. ఇందుకోసం ఆయా జిల్లా కలెక్టర్లకు రూ.12 కోట్లు విడుదల చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ను ఆదేశించారు.
ఏపీలో కరోనా మృతుల కుటుంబాలకు సాయం చేయాలని ముఖ్యమంత్రి జనగ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ప్రభుత్వం జీవో జారీ చేసింది.
కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.15వేలు ఇవ్వనున్నారు.
ఈ మేరకు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జీవో జారీ చేశారు. ఇందుకోసం ఆయా జిల్లా కలెక్టర్లకు రూ.12 కోట్లు విడుదల చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ను ఆదేశించారు.
వెంటనే నిధులు విడుదల చేయాల్సిందిగా ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే ప్లాస్మాను దానం చేసిన వారికి ఐదు వేలు అందివ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్లాస్మా థెరపీపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని.. దీని వల్ల మంచి ఫలితాలు ఉంటే ప్రోత్సహించాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు.
ప్లాస్మా దానం చేసే వారికి రూ. 5,000 ప్రోత్సాహకంగా ఇవ్వాలని ఆదేశించారు. ఈ డబ్బు వారు మంచి భోజనం తీసుకునేందుకు ఉపయోగపడుతుంది అన్నారు. చెప్పినట్లుగానే జీవో కూడా జారీ చేశారు.