ఆంధ్రప్రదేశ్‌లో మరో అంతర్జాతీయ విమానాశ్రయం ముస్తాబు కానుంది…జీఎంఆర్‌తో జగన్ సర్కార్ ఎంవోయూ

ఏపీలో మరో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్.. జీఎంఆర్‌తో జగన్ సర్కార్ ఎంవోయూ

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో జీఎంఆర్‌ సంస్థ ఒప్పందం కుదర్చుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో మరో అంతర్జాతీయ విమానాశ్రయం ముస్తాబు కానుంది.

ఇందుకు సంబంధించిన విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో జీఎంఆర్‌ సంస్థ ఒప్పందం కుదర్చుకుంది.

సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారులు, జీఎంఆర్‌ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాలవలవన్, జీఎంఆర్‌ చైర్మన్‌ జీబీఎస్‌ రాజు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతం రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్‌ ఆర్కే రోజా, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిరస్మరణీయ రీతిలో భోగాపురం ఎయిర్‌పోర్టును నిర్మిస్తామని జీఎంఆర్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో అన్నారు.

దీని కోసం ప్రముఖ అంతర్జాతీయ సంస్థల సేవలను వినియోగించుకుంటున్నట్లు జీఎంఆర్‌ ప్రతినిధులు వెల్లడించారు. తాము పుట్టిన ప్రాంతంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

సీఎం జగన్ మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి సదుపాయం వస్తుందని సీఎం వ్యాఖ్యానించారు.

ఎయిర్‌పోర్టు నుంచి విశాఖ నగరానికి వీలైనంత వేగంగా, సులభంగా, సౌకర్యంగా చేరుకునేలా రహదారులను నిర్మిస్తామని సీఎం వెల్లడించారు.

వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. అలాగే భోగాపురం ఎయిర్‌పోర్టుకు విశాఖనగరంతో అనుసంధానం చేసేలా మెట్రో ఏర్పాటుపైనా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి జగన్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *