కాశ్మీర్ లో ఉగ్రదాడి ని కాంగ్రెస్ రాజకీయం చేయాలని చూస్తోందని అమిత్ షా ధ్వజమెత్తారు

కాశ్మీర్ లో ఉగ్రదాడి ని కాంగ్రెస్ రాజకీయం చేయాలని చూస్తోందని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. కాశ్మీర్ సమస్య నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కారణం కాదా అని ప్రశ్నించారు? .

సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ను దేశంలో విలీనం చేసిన మహనీయుడని. ఆయనే ప్రధాని గా ఉంటే కాశ్మీర్ సమస్య తలెత్తే కాదన్నారు. ఆ విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించాలని హితవు పలికారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం భాజపా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. సైనికుడు లో ఆత్మహత్య నింపేలా ప్రధాని మోదీ చూస్తుంటే విమర్శించడంస రికాదన్నారు.

ఉగ్రదాడులకు పాకిస్తాన్ కు సంబంధం లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంటుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దానికి మద్దతు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు కు పక్క దేశ ప్రధాని మీద ఉన్న నమ్మకం మన ప్రధాని పై లేదు, నా రక్తంలో దేశభక్తి ఉంది ఈ విషయంలో మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదు.

గతంలో జరిగిన ఉగ్రదాడి లోను సమర్థంగా తిప్పి కొట్టాలి రాష్ట్రాలకు వెళ్లి దీక్షలు చేయడంపై దృష్టి పెడుతున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మీద మాత్రం దృష్టి పెట్టడం లేదని ఆయన విమర్శించారు.

విభజన చట్టంలో 14 అంశాల్లో పదింటిని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు, ఏ పీ లొ ఐ ఐటి ,ఎన్ఐటీ,ఐఐఎస్ఈఆర్ , కేంద్ర, గిరిజన, వ్యవసాయ విశ్వవిద్యాలయలు, ఏయిమ్స్ , ఆహార పరిశ్రమలో సముదాయం, విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవా.

8800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం రాజధానిని అనుసరించేలా విశాఖ, తిరుపతి, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం మోడీ నాయకత్వంలో అమలు చేశామని వివరించారు.

దేశంలోని ఏ రాష్ట్రానికి ఇవ్వనని నిధులు ఆంధ్రప్రదేశ్ కుఇచ్చామని అమిత్ షా తెలిపారు, అమరావతి పోలవరం నిర్మాణానికి నిధులు ఇచ్చామని చెప్పారు. వనరులు, నిధులు ఇస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని దూరం చేశారని ఆరోపించారు.

ఇంత అభివృద్ధి చేస్తున్న తాము సహకరించడం లేదని డానికి నైతిక హక్కు ఎక్కడ ఉందని సీఎం ను ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *