సీఐడీ దర్యాప్తు లో కనిపెట్టిన అగ్రిగోల్డ్ ఆస్తులు

AgriGold chairman, MD produced
సిఐడి అగ్రిగోల్డ్ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అగ్రిగోల్డ్ ఆస్తులను సిఐడి కనిపెట్టింది.
బినామీ పేర్లతో ఉన్న మొత్తం 151 స్థిరాస్తులను గుర్తించింది. హైదరాబాద్, గుంటూరు, ప్రకాశం జిల్లాలో 33 ఆస్తులను జప్తు చేసింది.
ఒక్క అమరావతి పరిధిలోని 600 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది.
ఆంధ్రప్రదేశ్లోని ఆరు జిల్లాల్లో ఉన్న 118 ఆస్తులను జప్తు చేయడానికి సిద్ధమైంది.
గుంటూరు, విశాఖ, విజయనగరం, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో పలు ఆస్తులను కూడా గుర్తించారు.
హాయ్ లాండ్ తో పాటుగా తమిళనాడు, కర్నాటకలలో భారీ స్థిరాస్తులు ఉన్నట్లు సిఐడి గుర్తించింది.
మొత్తం అగ్రి గోల్డ్ సంస్థకు సంబంధించిన మోసాలపై 29 కేసులు ఉన్నాయి. తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్ లో 15, కర్ణాటకలో 9, అండమాన్ నికోబార్ లో 1 ఉన్నాయి.
మొత్తం 19,18,865 డిపాజిటర్ల లో 11,57,497 మంది ఏపీ ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారే ఉన్నారు. మొత్తం 6,380 కోట్ల 31 లక్షల డిపాజిట్లలో ఏపీకి చెందిన 3,944 కోట్ల 70 లక్షల డిపాజిట్లు ఉన్నాయి.