YSRCPలో చేరిన జీవిత, రాజశేఖర్….

నటుడు రాజశేఖర్, జీవితలు సోమవారం (01-04-2019)న హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిసి మద్దతు పలికారు. అనంతరం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

1.2009లోొ వైసీపీలో చేరిన రాజశేఖర్, జీవిత.
2.జగన్‌తో విభేదాలతో పార్టీని వీడిన దంపతులు.
3.మళ్లీ పదేళ్ల తర్వాత వైసీపీగూటికి చేరారు.

సార్వత్రిక ఎన్నికలవేళ వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. టాలీవుడ్ నుంచి సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా పార్టీలో చేరుతున్నారు.

తాజాగా నటుడు రాజశేఖర్, జీవితలు సోమవారం (01-04-2019)న హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిసి మద్దతు పలికారు.

అనంతరం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జీవిత, రాజశేఖర్‌లకు పార్టీ కండువా కప్పి జగన్ సాదరంగా ఆహ్వానించారు. వైసీపీలో చేరడం ఆనందగా ఉందని.. తిరిగి సొంతగూటికి వచ్చినట్లు ఉందన్నారు.

ఏపీ అభివృద్ది చెందాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని రాజశేఖర్ అన్నారు. గతంలో జగన్‌తో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని.. ఆ ఘటనల్ని మర్చిపోయామన్నారు.

తాము గతంలో చూసిన జగన్ వేరు.. ఇప్పుడున్న జగన్ వేరన్నారు. ఆయన ఎన్నికష్టాలొచ్చినా జనం వెంటే నడుస్తున్నారని.. పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారన్నారు రాజశేఖర్.

జీవిత, రాజశేఖర్‌లు 2009లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత జగన్ వైసీపీ పెట్టడంతో మద్దతు పలకగా.. తర్వాత జగన్‌తో విభేదాల కారణంతో పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న రాజశేఖర్ దంపతులు గతేడాది చంద్రబాబును కలిసి మద్దతు పలికారు. ఇప్పుడు ఎన్నికలవేళ మళ్లీ వైసీపీలో చేరి ట్విస్ట్ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *