సినీనటుడు మోహన్‌బాబుకు ఏడాది జైలుశిక్ష…

లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై వైవీఎస్ చౌదరి ఓ సినిమా తీశారు. దీనికి సంబంధించి ఆయనకు రెమ్యునరేషన్‌గా మోహన్‌బాబు ఓ చెక్కు ఇచ్చారు.

ఆ చెక్కు బౌన్స్ కావడంతో వైవీఎస్ చౌదరి 2010లో మోహన్‌బాబుపై కేసు వేశారు.

1.చెక్ బౌన్స్ కేసులో సినీనటుడు మోహన్‌బాబుకు చుక్కెదురు.
2.ఏడాది జైలుశిక్షతో పాటు రూ.41.75లక్షల జరిమానా విధించిన ఎర్రమంజిల్ కోర్టు.
3.బెయిల్‌కు అప్లై చేసుకున్న మోహన్‌బాబు.

చెక్‌బౌన్స్ కేసులో సినీనటుడు మోహన్‌బాబుకు చుక్కెదురైంది. దర్శకుడు వైవీఎస్ చౌదరి దాఖలు చేసిన కేసును విచారించిన ఎర్రమంజిల్ న్యాయస్థానం మోహన్‌బాబుకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

దీంతో పాటు రూ.41.75లక్షల జరిమానా విధించి ఆ మొత్తాన్ని వైవీఎస్ చౌదరికి చెల్లించాలని ఆదేశించింది.

లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై వైవీఎస్ చౌదరి ఓ సినిమా తీశారు. దీనికి సంబంధించి ఆయనకు రెమ్యునరేషన్‌గా మోహన్‌బాబు ఓ చెక్కు ఇచ్చారు. ఆ చెక్కు బౌన్స్ కావడంతో వైవీఎస్ చౌదరి 2010లో మోహన్‌బాబుపై కేసు వేశారు.

ఏ1గా లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ను, మోహన్‌బాబును ఏ2గా ఈ కేసులో చేర్చారు. సుమారు తొమ్మిదేళ్లుగా ఎర్రమంజిల్ కోర్టులో దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి.

ఈరోజు (ఏప్రిల్ 2) తుది వాదనలు విన్న న్యాయస్థానం మోహన్‌బాబుకు ఏడాది జైలుశిక్షతో విధించడంతో పాటు వైవీఎస్ చౌదరికి రూ.41.75లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఏ1 లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ బ్యానర్‌కు రూ.10వేల జరిమానా విధించింది.

బెయిల్‌‌కు దరఖాస్తు చేసిన మోహన్‌బాబు
ఈ కేసులో శిక్ష పడిన మోహన్‌బాబు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. శిక్ష అమలుకు 30రోజుల గడువు ఉండటంతో ఈలోగా బెయిల్ వచ్చేలా మోహన్‌బాబు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *