పరిశ్రమలకు ఆధార్ తరహా నంబర్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పరిశ్రమలకు ఆధార్ తరహా నంబర్లు ఇవ్వాలని నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమకూ ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్యను కేటాయించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ‘పరిశ్రమ ఆధార్’ పేరుతో ప్రత్యేక సంఖ్య జారీ చేయనుంది.

ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సమగ్ర సర్వే కోసం ప్రభుత్వం కొన్ని కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ నేతృత్వంలో పని చేయనుంది.

అక్టోబర్ 15వ తేదీ లోపు సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కార్మికులు, విద్యుత్, భూమి, నీరు, ఇతర వనరులు, ఎగుమతి, దిగుమతులు, ముడి సరుకు లభ్యత, మార్కెటింగ్ తదితర అంశాలను తెలుసుకోవాలని కమిటీలకు ప్రభుత్వం సూచించింది.

ఇలా మొత్తం 9 అంశాల్లో పరిశ్రమల శాఖ సర్వే వివరాలు సేకరించనుంది.

మొబైల్ అప్లికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పరిశ్రమల్లో వివరాలను సేకరించనుంది. కాగా, ఏపీ సమగ్ర పరిశ్రమ సర్వే 2020 పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొబైల్ అప్లికేషన్ ద్వారా పరిశ్రమల్లోని వివరాలను గ్రామ సచివాలయ సిబ్బంది వివరాలు సేకరించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *