సర్కారు పాలనలో దేశం అప్పులకుప్పగా మారుతోంది

మోడీ పైసా అప్పు తేలేదు.. తిరిగి ఇతర దేవలకు కోట్లు సాయం చేస్తున్నాడు అని తెల్లారి లేస్తే మోడీ భక్తులు గొంతులు చించుకుంటారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్ డీఏ సర్కారు పాలనలో దేశం అప్పులకుప్పగా మారుతోంది. మోడీ ఏలుబడిలో గడిచిన నాలుగున్నరేళ్లలో దేశ రుణ భారం దాదాపు50 శాతం పెరిగిపోయింది. భారత రుణ భారం రూ.82 లక్షల కోట్లను దాటిపోయింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అప్పులపై ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఎనిమిదో ఎడిషన్ స్టేటస్ పేపర్కోట్లు పెరిగాయన్నమాట.

దేశాన్ని ప్రకారం గతేడాది సెప్టెంబర్ నాటికి మొత్తం కేంద్ర ప్రభుత్వ రుణాలు రూ. 8203253 కోట్లను చేరుకున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన జూన్ 2014లో రూ.5490763 కోట్లుగానే ఉన్నాయి. మోడీ హయాంలో సర్కారీ రుణాలు మరో రూ.2712490 కోట్లు పెరగయన్నమాట. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్న నమో.. అప్పుల సేకరణకున్న ఏ అవకాశాన్ని విడిచిపెట్టకపోవడం గమనారం. కేంద్రంలో మోడీ సహకార అధికారంలోకి రాకముందు గోల్డ్ బాండ్ల ద్వారా సమీకరించిన రుణాలేమీ లేవు. అయితే ఇప్పుడు ఆ మార్గంలో అందుకున్న అప్పులు విలువ రూపాయలు 9089 కోట్లుగా ఉంది. ఇక మార్కెట్ ఆధారిత రుణాలూ గతంలో పోల్చితే 47.5 శాతం పెరిగి రూపాయలు 52 లక్షలు కోట్లకు పైగా పేరుకుపోయాయని ఈ నివేదిక స్పష్టం చేసింది.

ప్రభుత్వ ఆదాయానికి వ్యయానికి మధ్య అంతరం తారాస్థాయికి చేరుతుండటంతో ద్రవ్యలోటు లక్య్లు దెబ్బతింటున్నాయి. ఆదాయం కంటే ఖర్చులు పెరిగి పోతుండటంతో పాలనాపరమైన నిర్వహణలో భాగంగా ప్రభుత్వం అప్పుల బాట పడుతోంది. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటర్లను ఆకట్టుకోవడంలో భాగంగా సంక్షేమ పథకాలు కేటాయింపులను పెంచుతుండటం కూడా ఆర్థిక క్రమశిక్షణ కు భంగం వాటిల్లుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2018-2019)గాను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ద్రవ్యలోటును దేశ జీడీపీ లో 3.3శాతానికి (రూ6.24లక్షల కోట్లు)కట్టడి చేస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆర్థిక సంవత్సరం(2017-18)లో ద్రవ్యలోటును 3.5 శాతానికే కబట్టి చేశారు.

అయితే గతేడాది నవంబర్ తో ముగిసిన ఎనిమిది నెలల కాలంలో నే ద్రవ్యలోటు రూ.7.17 లక్షల కోట్లకు చేరింది. ఇంకా నాలుగు నెలలు మిగిలి ఉండగానే 114.8 శాతంగా నమోదు కావడం ప్రభుత్వంకలవరపెడుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు పెట్టుబడులు ఉపసంహరణ సైతం ఫలితాలు ఇవ్వడం లేదని విశ్లేషకులు పేర్కోంటున్నారు. ఈఆర్రఠ సంవత్సరం లో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ఖజానాకు రూ.80000 కోట్ల నిధులను తరలించాలిని

మోడీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటిదాకా 34 వేల కోట్లకు పైగానే సమీకరించింది. ఓ వైపు పెరుగుతున్న రుణభారం మరోవైపు నెరవేరని పెట్టుబడుల ఉపసంహారం లక్ష్యం… ఇంకోవైపు వస్తు సేవల పన్ను(జీఎస్టీ) తదితర మార్గాల ద్వారా పడిపోతున్న ఆదాయ.. మోడీ సర్కార్ పై ముప్పేట దాడినే చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ సంస్థల నుంచి డివిడెండ్లపై ఆశలు పెట్టుకున్న ప్రభుత్వం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మిగులు నిల్వలపై కన్నేసింది. ఆ సోమ్మతో పాత పెద్ద నోట్ల రద్దు జీఎస్టీ అమలుతో ఏర్పడిన ఇబ్బందులనేగాక ఐఎల్ అండ్ ఎఫ్ ఎస్ రుణ సంక్షోభం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ లో కలిగిన సమస్యలనూ అధిగమించవచ్చునని భావించింది. అది కుదురకపోవడంతో ఆర్బీఐ నుంచి మధ్యంతర డివిడెండ్ను మోడీ సర్కార్ కోరుతున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *