44 మంది ఉగ్రవాదులను పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది…
పాకిస్థాన్ మసూద్ అజహర్ సోదరుడు సహా 44 మంది అరెస్ట్
ఉగ్రవాదంపై చర్యలకు పాకిస్థాన్ ఎట్టకేలకు సిద్ధపడుతోంది.
44 మంది ఉగ్రవాదులను పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వీరిలో మసూద్ అజహర్ సోదరుడు కూడా ఉన్నాడని సమాచారం.
1.ఉగ్రవాదంపై చర్యలకు పాకిస్థాన్ ఎట్టకేలకు సిద్ధపడుతోంది.
2.44 మంది ఉగ్రవాదులను పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.
3.వీరిలో మసూద్ అజహర్ సోదరుడు కూడా ఉన్నాడని సమాచారం.
ఉగ్రవాదంపై పోరాటంలో పాకిస్థాన్పై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతున్న వేళ.. ఆ దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోంది.
జైషే మహ్మద్తో పాటు నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్రవాద సంస్థలపై పాక్ సర్కారు కొరడా ఝలిపిస్తోంది. జైషే మహ్మద్ సహా ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన 44 మందిని పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని దునియా న్యూస్ తెలిపింది. కాగా వారిని అదుపులోకి మాత్రమే తీసుకున్నారని కూడా వార్తలొస్తున్నాయి.
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అస్ఘర్ అలియా ముఫ్తీ అబ్దుర్ రవూఫ్ను కూడా పాకిస్థాన్ కస్టడీలోకి తీసుకుందని సమాచారం. జైషే మహ్మద్కు చెందిన హమ్మద్ అజహర్ను అరెస్ట్ చేశామని పాక్ మంత్రి షెహర్యార్ ఖాన్ అఫ్రిదీ మీడియా సమావేశంలో తెలిపారు.
గత వారం భారత ప్రభుత్వం ఇచ్చిన జాబితాలో ముఫ్తీ అబ్దుర్ రవూఫ్, హమ్మద్ అజహర్ పేర్లు ఉన్నాయని పాక్ మంత్రి తెలిపారు.
భారత్, అంతర్జాతీయ సమాజం నుంచి వస్తోన్న ఒత్తిడి మేరకే ఇలా చేస్తున్నారన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
వ్యక్తులు లేదా సంస్థలపై ఐక్యరాజ్య సమితి ఆంక్షలను అమలు చేయాలనే చట్టం సోమవారమే పాకిస్థాన్లో అమల్లోకి వచ్చింది. దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న నిషేధిత ఉగ్రవాద సంస్థల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైజల్ తెలిపారు.